Trends

పాక్ కు హెచ్ఏఎల్ ఉద్యోగి గూఢచర్యం..అరెస్టు

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పహారా కాస్తుంటారు. వెన్నులో వణుకు పుట్టించే చలిని సైతం లెక్క చేయకుండా సియాచిన్ మంచుకొండల్లో గుండెను రాయి చేసుకొని సైనికులు కాపలా కాస్తుంటారు. మండుటెండలకు మలమల మాడిపోతున్నప్పటికీ దాయాది దేశం నీడకూడా మన దేశంపై పడకుండా పోరాడుతుంటారు సైనికులు. అయితే, ఇటువంటి సైనికుల త్యాగాలను నీరుగారుస్తూ కొందరు స్వార్థపరులు డబ్బుకోసం దేశ రక్షణను తాకట్టు పెడుతుంటారు. కాసులకు కక్కుర్తిపడి అత్యంత విలువైన సమాచారాన్ని దాయాది దేశానికి అమ్ముకుంటుంటారు.

గతంలో ఈ తరహా దేశద్రోహులు పట్టుబడినా….వారికి కఠిన శిక్షలు విధించినా….కొందరు వ్యక్తులు ఇంకా అటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని హెచ్ఏఎల్ కంపెనీలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి భారత ఫైటర్ జెట్ విమానాలకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అమ్ముకున్న ఘటన కలకలం రేపింది. చివరకు ఆ దేశద్రోహి గుట్టు రట్టవడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని కటకటాల వెనక్కు నెట్టారు.

నాసిక్ సమీపంలోని ఓజార్ లో ఉన్న హెచ్ఏఎల్ సంస్థలో ఫైటర్ జెట్ విమానాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆ సంస్థలో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న దీపక్ శ్రీశాత్ ఫైటర్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ కి పంపుతున్నాడు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన దేశ రక్షణ సమాచారాన్ని వాట్సాప్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా పంపేవాడు. కార్యాలయంలో నిషిధ్ధ ప్రాంతాలు, ఫైటర్ జెట్ల వివరాలు, తదితర సమాచారమంతా అమ్ముతున్నాడు.

అయితే, ఇతడి వ్యవహారం బట్టబయలు కావడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీపక్ నుంచి మూడు మొబైల్ ఫోన్లు, అయిదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. దీపక్ తో పాటు మరెవరన్నా ఉన్నారా…దీపక్ ఇంకే సమాచారం చేరవేస్తున్నాడు…అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

This post was last modified on October 10, 2020 11:33 am

Share
Show comments
Published by
satya
Tags: HALISI

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

1 hour ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago