దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పహారా కాస్తుంటారు. వెన్నులో వణుకు పుట్టించే చలిని సైతం లెక్క చేయకుండా సియాచిన్ మంచుకొండల్లో గుండెను రాయి చేసుకొని సైనికులు కాపలా కాస్తుంటారు. మండుటెండలకు మలమల మాడిపోతున్నప్పటికీ దాయాది దేశం నీడకూడా మన దేశంపై పడకుండా పోరాడుతుంటారు సైనికులు. అయితే, ఇటువంటి సైనికుల త్యాగాలను నీరుగారుస్తూ కొందరు స్వార్థపరులు డబ్బుకోసం దేశ రక్షణను తాకట్టు పెడుతుంటారు. కాసులకు కక్కుర్తిపడి అత్యంత విలువైన సమాచారాన్ని దాయాది దేశానికి అమ్ముకుంటుంటారు.
గతంలో ఈ తరహా దేశద్రోహులు పట్టుబడినా….వారికి కఠిన శిక్షలు విధించినా….కొందరు వ్యక్తులు ఇంకా అటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని హెచ్ఏఎల్ కంపెనీలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి భారత ఫైటర్ జెట్ విమానాలకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అమ్ముకున్న ఘటన కలకలం రేపింది. చివరకు ఆ దేశద్రోహి గుట్టు రట్టవడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని కటకటాల వెనక్కు నెట్టారు.
నాసిక్ సమీపంలోని ఓజార్ లో ఉన్న హెచ్ఏఎల్ సంస్థలో ఫైటర్ జెట్ విమానాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆ సంస్థలో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న దీపక్ శ్రీశాత్ ఫైటర్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ కి పంపుతున్నాడు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన దేశ రక్షణ సమాచారాన్ని వాట్సాప్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా పంపేవాడు. కార్యాలయంలో నిషిధ్ధ ప్రాంతాలు, ఫైటర్ జెట్ల వివరాలు, తదితర సమాచారమంతా అమ్ముతున్నాడు.
అయితే, ఇతడి వ్యవహారం బట్టబయలు కావడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీపక్ నుంచి మూడు మొబైల్ ఫోన్లు, అయిదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. దీపక్ తో పాటు మరెవరన్నా ఉన్నారా…దీపక్ ఇంకే సమాచారం చేరవేస్తున్నాడు…అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on October 10, 2020 11:33 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…