Trends

ఆస్ట్రేలియా దెబ్బ.. ఫైనల్స్ లో భారత్ ఉంటుందా?

భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.

ఈ ఓటమితో టీమిండియా పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి పడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానానికి దిగజారిన భారత్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించడానికి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. శ్రీలంక (50 పీసీటీ) నాలుగో స్థానంలో నిలిచి భారత్‌కు పోటిగా ఉంది.

భారత్ మరో మూడు టెస్ట్ మ్యాచ్‌లను మాత్రమే ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లను గెలిస్తేనే 64.03 పాయింట్లతో ఫైనల్‌కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమిని చూస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేస్‌ నుంచి భారత జట్టు బయట పడుతుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు ఫలితాలు భారత్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టులను గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా తమ అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే 69 పాయింట్లతో ఫైనల్‌కి చేరే అవకాశాలు ఉంటాయి. ఇక భారత్ పైనే కాకుండా శ్రీలంక రూపంలో కూడా పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియా మిగతా టెస్టుల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకంటుందో చూడాలి.

This post was last modified on December 8, 2024 1:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago