భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనలిస్ట్గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.
ఈ ఓటమితో టీమిండియా పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి పడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానానికి దిగజారిన భారత్, డబ్ల్యూటీసీ ఫైనల్కి అర్హత సాధించడానికి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. శ్రీలంక (50 పీసీటీ) నాలుగో స్థానంలో నిలిచి భారత్కు పోటిగా ఉంది.
భారత్ మరో మూడు టెస్ట్ మ్యాచ్లను మాత్రమే ఆడనుంది. ఈ మూడు మ్యాచ్లను గెలిస్తేనే 64.03 పాయింట్లతో ఫైనల్కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమిని చూస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత జట్టు బయట పడుతుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు ఫలితాలు భారత్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టులను గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా తమ అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే 69 పాయింట్లతో ఫైనల్కి చేరే అవకాశాలు ఉంటాయి. ఇక భారత్ పైనే కాకుండా శ్రీలంక రూపంలో కూడా పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియా మిగతా టెస్టుల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకంటుందో చూడాలి.
This post was last modified on December 8, 2024 1:26 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…