#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి.
దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు ఆ చిన్న హోటల్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఐతే లాక్ డౌన్ కారణంగా ఆ హోటల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత తిరిగి హోటల్ తెరిచినా.. పెద్దగా వ్యాపారం జరగలేదు. దీంతో తమ దయనీయ స్థితి గురించి వివరిస్తూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
అంత పెద్ద వయస్కుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోయాయి. సోనమ్ కపూర్ లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ వీడియోను షేర్ చేశారు. అంతే.. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి వేల మంది ముందుకొచ్చారు. కొందరు నేరుగా వెళ్లి డబ్బుల సాయం చేస్తే.. మరెంతో మంది ఆ హోటల్కు వెళ్లి భోజనం చేసి వారికి తోడ్పాటు అందించాలనుకున్నారు.
దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న హోటల్ ఇప్పుడు రద్దీగా మారిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ జనం పోగయ్యారు. ఒక్కసారిగా పెరిగిపోయిన జనాల ఉద్ధృతితో ఒక పది మంది పనోళ్లను పెట్టుకుంటే తప్ప అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ వృద్ధులకు వచ్చిన పాపులారిటీ, ఆదరణ చూస్తుంటే.. వాళ్లు ఇంక ఎప్పటికీ ఆదాయం గురించి బాధ పడాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. సోషల్ మీడియా పవర్ ఏంటో.. దాన్ని సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.
This post was last modified on October 8, 2020 9:59 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…