Trends

సోషల్ మీడియా పవర్ ఇది

#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్‌చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి.

దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్‌లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్‌ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు ఆ చిన్న హోటల్‌ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఐతే లాక్ డౌన్‌ కారణంగా ఆ హోటల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత తిరిగి హోటల్ తెరిచినా.. పెద్దగా వ్యాపారం జరగలేదు. దీంతో తమ దయనీయ స్థితి గురించి వివరిస్తూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.

అంత పెద్ద వయస్కుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోయాయి. సోనమ్ కపూర్ లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ వీడియోను షేర్ చేశారు. అంతే.. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి వేల మంది ముందుకొచ్చారు. కొందరు నేరుగా వెళ్లి డబ్బుల సాయం చేస్తే.. మరెంతో మంది ఆ హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వారికి తోడ్పాటు అందించాలనుకున్నారు.

దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న హోటల్ ఇప్పుడు రద్దీగా మారిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ జనం పోగయ్యారు. ఒక్కసారిగా పెరిగిపోయిన జనాల ఉద్ధృతితో ఒక పది మంది పనోళ్లను పెట్టుకుంటే తప్ప అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ వృద్ధులకు వచ్చిన పాపులారిటీ, ఆదరణ చూస్తుంటే.. వాళ్లు ఇంక ఎప్పటికీ ఆదాయం గురించి బాధ పడాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. సోషల్ మీడియా పవర్ ఏంటో.. దాన్ని సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.

This post was last modified on October 8, 2020 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

59 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

9 hours ago