Trends

సోషల్ మీడియా పవర్ ఇది

#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్‌చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి.

దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్‌లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్‌ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు ఆ చిన్న హోటల్‌ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఐతే లాక్ డౌన్‌ కారణంగా ఆ హోటల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత తిరిగి హోటల్ తెరిచినా.. పెద్దగా వ్యాపారం జరగలేదు. దీంతో తమ దయనీయ స్థితి గురించి వివరిస్తూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.

అంత పెద్ద వయస్కుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోయాయి. సోనమ్ కపూర్ లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ వీడియోను షేర్ చేశారు. అంతే.. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి వేల మంది ముందుకొచ్చారు. కొందరు నేరుగా వెళ్లి డబ్బుల సాయం చేస్తే.. మరెంతో మంది ఆ హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వారికి తోడ్పాటు అందించాలనుకున్నారు.

దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న హోటల్ ఇప్పుడు రద్దీగా మారిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ జనం పోగయ్యారు. ఒక్కసారిగా పెరిగిపోయిన జనాల ఉద్ధృతితో ఒక పది మంది పనోళ్లను పెట్టుకుంటే తప్ప అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ వృద్ధులకు వచ్చిన పాపులారిటీ, ఆదరణ చూస్తుంటే.. వాళ్లు ఇంక ఎప్పటికీ ఆదాయం గురించి బాధ పడాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. సోషల్ మీడియా పవర్ ఏంటో.. దాన్ని సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.

Satya

Recent Posts

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

9 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

1 hour ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

1 hour ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

2 hours ago