#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి.
దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు ఆ చిన్న హోటల్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఐతే లాక్ డౌన్ కారణంగా ఆ హోటల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత తిరిగి హోటల్ తెరిచినా.. పెద్దగా వ్యాపారం జరగలేదు. దీంతో తమ దయనీయ స్థితి గురించి వివరిస్తూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
అంత పెద్ద వయస్కుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోయాయి. సోనమ్ కపూర్ లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ వీడియోను షేర్ చేశారు. అంతే.. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి వేల మంది ముందుకొచ్చారు. కొందరు నేరుగా వెళ్లి డబ్బుల సాయం చేస్తే.. మరెంతో మంది ఆ హోటల్కు వెళ్లి భోజనం చేసి వారికి తోడ్పాటు అందించాలనుకున్నారు.
దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న హోటల్ ఇప్పుడు రద్దీగా మారిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ జనం పోగయ్యారు. ఒక్కసారిగా పెరిగిపోయిన జనాల ఉద్ధృతితో ఒక పది మంది పనోళ్లను పెట్టుకుంటే తప్ప అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ వృద్ధులకు వచ్చిన పాపులారిటీ, ఆదరణ చూస్తుంటే.. వాళ్లు ఇంక ఎప్పటికీ ఆదాయం గురించి బాధ పడాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. సోషల్ మీడియా పవర్ ఏంటో.. దాన్ని సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…