Trends

భారత్‌లోనే వారిని ఓడించండి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించారు. ఐసీసీ టోర్నీలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షరతులు పెట్టడం సరైంది కాదని అక్తర్ పేర్కొన్నారు. “భారత్‌లో మ్యాచ్‌లు ఆడకుండా తటస్థ వేదికలు కోరడం బదులు, వారిని వారి సొంతగడ్డపైనే ఓడించి రావాలి” అంటూ పీసీబీకి సలహా ఇచ్చారు.

ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపినప్పటికీ, భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని స్పష్టంగా తెలిపింది. గతంలో కూడా పాకిస్థాన్‌లో జరిగే టోర్నీలకు భారత్ దూరంగా ఉండటం వల్ల ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంది. పీసీబీ ఈ పద్ధతికి మొట్టమొదట అంగీకరించకపోయినా, చివరకు ఈ సూత్రాన్ని ఆమోదించింది.

అయితే, అదే సమయంలో పీసీబీ తన దిశగా కొన్ని కఠినమైన షరతులను పెట్టింది. పీసీబీ ప్రకారం, భవిష్యత్తులో పాకిస్థాన్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయిస్తే, ఈ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీ హామీ ఇవ్వాలని కోరింది. అంతేకాక, ఐసీసీ వార్షిక ఆదాయంలో పాక్ వాటాను పెంచాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారగా, అక్తర్ స్పందన మరింత దృష్టిని ఆకర్షించింది.

“ఈ షరతులు క్రికెట్ ఆత్మను కించపరిచేలా ఉన్నాయి. భారత్‌లో మ్యాచ్‌లు ఆడడం ఒక్క పాక్ క్రికెట్ బోర్డుకు మాత్రమే కాకుండా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు గౌరవంగా ఉంటుంది. భారత్‌లో క్రికెట్ ఆడడం ద్వారా మాత్రమే గొప్ప విజయాలను సాధించగలుగుతాం” అని అక్తర్ చెప్పారు. ఐసీసీకి షరతులు విధించడం బదులు, ఆటతీరు, ప్రదర్శనలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే పీసీబీ-భారత్ మధ్య సంబంధాలు తారుమారు అవుతున్న ఈ తరుణంలో, షోయబ్ వ్యాఖ్యలు పీసీబీ వ్యూహంపై ప్రశ్నల్ని రేకెత్తించాయి. పీసీబీ ఈ సూచనలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే భవిష్యత్తులో భారత్ పర్యటనపై పాక్ క్రికెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

This post was last modified on December 2, 2024 5:21 pm

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

38 minutes ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

2 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

2 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

3 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

3 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

3 hours ago