ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా వేలం చరిత్రలో అమ్ముడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డుపుటలకెక్కాడు. 13 ఏళ్ల ఈ టీనేజ్ కుర్రాడు క్రికెట్ దిగ్గజాల సరసన వేలం అమ్ముడై ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్లకు సూర్యవంశీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అది చిన్న వయస్కుడిగా ఓ రికార్డు క్రియేట్ చేసిన సూర్యవంశీ..తాజాగా వేలంలో సెలక్ట్ అయి మరో రికార్డు బద్దలు కొట్టాడు.
ఓ వైపు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వంటి విధ్వంసకర అంతర్జాతీయ క్రికెటర్లు..దేవదత్ పడిక్కల్, పీయూష్ చావ్లా వంటి భారతీయ క్రికెటర్లు అమ్ముడుపోని తరుణంలో 13 ఏళ్ల ఈ యువ సంచలనం కోటి పది లక్షల రూపాయలకు అమ్ముడుపోవడం అంతర్జాతీయ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టీనేజ్ టీ 20 విధ్వంసకర బ్యాట్స్ మన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడింది. చివరకు ఆర్ఆర్ అతడిని దక్కించుకుంది.
బీహార్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ 2024లో 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. బీహార్లోని ఓ మారమూల గ్రామానికి చెందిన వైభవ్ సూర్యవంశీ నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టి భళా అనిపించాడు. సూర్యవంశీ టాలెంట్ గుర్తించిన అతడి తండ్రి సంజీవ్ వెన్నుతట్టి ప్రోత్సహించాడు. వృత్తిరీత్యా రైతు అయిన సంజీవ్….సూర్యవంశీ కోసం ఇంటి పెరట్లో చిన్న ప్లే గ్రౌండ్ ను నిర్మించాడు.
9 ఏళ్ల వయసులో సమస్తిపూర్ లోని ఓ క్రికెట్ అకాడమీలో సూర్యవంశీని చేర్పించాడు. అలా అంచెలంచెలుగా ఎదిగిన సూర్యవంశీ…తాజాగా ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆల్రెడీ అండర్-19 ఆసియా కప్ కు సెలక్ట్ అయిన సూర్యవంశీ ఐపీఎల్ లోనూ ఆకట్టుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టేందుకు ఎన్నో రోజుల పట్టదు. 13 ఏళ్లకే ఐపీఎల్ ఆడుతున్న ఈ యువ సంచలనం భవిష్యత్ సచిన్ అవుతాడేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 25, 2024 10:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…