క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి బ్యాటర్, తన దూకుడు స్టైల్తో అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి ఆటగాడు భారత జట్టులో మళ్ళీ కనిపించలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు వీరు వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.
తాజాగా కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడిన ఆర్యవీర్ సెహ్వాగ్, మేఘాలయపై అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్ మొత్తం 229 బంతులు ఎదుర్కొని 200 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో రెండు సిక్సర్లు, ఏకంగా 34 బౌండరీలు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారా మాత్రమే 148 పరుగులు సాధించిన ఆర్యవీర్ తన అటాక్ మూడ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆర్యవీర్ బ్యాటింగ్ చూసి తండ్రికి తగ్గ తనయుడు అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెహ్వాగ్ తరహా దూకుడు ఆటను ఆర్యవీర్ ప్రదర్శించడంతో, అతనికి భవిష్యత్తులో టీమిండియాలో స్థానం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాడి గేమ్ మేచ్యూరిటీని చూసి, అతని ప్రదర్శనల పట్ల క్రికెట్ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
ఈ ఫీట్తో అభిమానులు ఒక్కసారిగా ఆర్యవీర్పై ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రిలాగే టీమిండియాకు సేవలందించాలని కోరుకుంటున్నారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇటువంటి ప్రదర్శన కనబరచిన ఆర్యవీర్, తన కెరీర్లో మరిన్ని ఘనతలను సాధించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నారు. సెహ్వాగ్ వారసుడి ప్రతిభ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా, సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ తన తొలి డబుల్ సెంచరీతో క్రికెట్లో తన ప్రత్యేకతను చాటిచెప్పాడు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా క్రికెట్ రంగంలో గుర్తింపు అందుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on November 22, 2024 9:33 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…