వైజాగ్ సముద్రజలాల్లో తొందరలోనే ఫ్లోటింగ్ కాసినోలు ప్రారంభమవుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. విశాఖపట్నానికి సమీపంలోని సముద్రంలో ఫ్లోటింగ్ కాసినోల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్రప్రభుత్వం కోరిందట. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. ఫ్లోటింగ్ కాసినోలు ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి అవసరం. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలో ఇదే మొదటి కాసినో అవుతుంది.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా రాష్ట్రప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఫ్లోటింగ్ కాసినోలు ప్రస్తుతం గోవాలో ఉన్నాయి. ఈ కాసినోల కారణంగా విదేశీయులు, దేశంలోని పలువురు ప్రముఖులు కూడా తరచూ గోవాకు వెళుతుంటారు. ఇక్కడ పోకర్, బ్లాక్ జాక్, రమ్మీ రూపంలో భారీ ఎత్తున జూదం నడుస్తంటుంది. ఇటువంటి జూదంలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగాల్లోని ప్రముఖులు, వారి వారసులు ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు.
ప్రస్తుతం మన దగ్గర ఇటువంటి ఫ్లోటింగ్ కాసినోలు లేని కారణంగా మన రాష్ట్రం నుండి అనేకమంది రెగ్యులర్ గా గోవాతో పాటు శ్రీలంక, దుబాయ్, హాంగ్ కాంగ్, సింగపూర్, థాయ్ ల్యాండ్ లాంటి విదేశాలకు కూడా వెళుతుంటారని సమాచారం. మూడు లేదా ఐదంతస్తుల క్రూయిజ్ లేదా లేదా పెద్ద పెద్ద బోట్లలో ఇటువంటి కాసినోలు ఏర్పాటు చేస్తారు. ఇటువంటి కాసినోలు సముద్రంలో ఎక్కడో ఉంటాయి. వీటి దగ్గరకు మామూలు బోట్లలో జనాలను చేరుస్తారు. ఇటువంటి ఫ్లోటింగ్ కాసినోల్లోనే బస, వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
కాసినోలకు కేంద్రప్రభుత్వం అనుమతిస్తే పోలీసుల రైడింగుల భయం ఉండదు. కాబట్టి నిర్భయంగా ఎన్ని రోజులైనా ఆడుకోవచ్చు. లాడ్జింగ్ , బోర్డింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఒకసారి కేంద్రం గనుక అనుమతిచ్చేస్తే రాష్ట్రప్రభుత్వంతో పాటు అందరు ఫుల్ హ్యాపీస్. ఈ ఫ్లోటింగ్ కాసినోలతో పాటు ఇతర క్రీడలైన ప్యారా గ్లైడింగ్, స్కూబా డైవింగ్, స్కీ బోటింగ్, జెట్ స్కీల్లాంటి వాటికి ఇప్పటికే అనుమతులున్నాయి. కాబట్టి కేంద్రం గనుక కాసినో ఏర్పాటుకు అనుమతిచ్చేస్తే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్నారు. చూద్దాం దీని కారణంగా ఏమాత్రం ఆదాయం పెరుగుతుందో.
This post was last modified on October 5, 2020 12:12 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…