తన కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిని, ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్లు ఆడలేక రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్కు పరిమితం అయిన అతడికి.. ఇక్కడా పరిస్థితులు అనుకూలించడం లేదు. రిటైర్మెంట్తో బరువు దించేసుకున్న అతను.. ఐపీఎల్లో తన సత్తా చూపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పట్లేదు.
ఓవైపు చెన్నై జట్టు ఆశించిన ప్రదర్శన చేయట్లేదు. మరోవైపు వ్యక్తిగతంగా ధోని కూడా రాణించలేకపోతున్నాడు. దీంతో అభిమానులకు మునుపెన్నడూ చూడని విధంగా నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాడు ధోని. శుక్రవారం రాత్రి సన్రైజర్స్-చెన్నై మ్యాచ్లో అది స్పష్టంగా కనిపించింది. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ బంతిని సరిగా హిట్ చేయలేక, వేగంగా ఆడలేక ధోని ఇబ్బంది పడ్డాడు. దీనికి తోడు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయింది చెన్నై.
ఐతే తర్వాతి మ్యాచ్లో చెన్నై బలంగా పుంజుకుంటుందని, ధోని కూడా ఊపందుకుంటాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సన్రైజర్స్ చేతిలో చెన్నై ఓడిపోయింది. ధోని మరోసారి హిట్టింగ్ చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్ల్లో మాదిరే ముందు బంతులు వృథా చేసి చివర్లో హిట్ చేసే ప్రయత్నం చేశాడు. అది వర్కవుట్ కాలేదు. ధోని ఒంట్లో ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. చాలా అలసిపోయినట్లు, ఫిట్నెస్ దెబ్బ తిన్నట్లుగా అగుపించాడు. వికెట్ల మధ్య పరుగు తీయలేక ఆయాసపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా చూసి ధోని పనైపోయిందని, అతను వేస్ట్ అని కొందరు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. ధోనీని ట్రోల్ చేస్తున్నారు.
కానీ ఏడాదికిపైగా విరామం తర్వాత, పెద్దగా ప్రాక్టీస్ లేకుండా ధోని ఐపీఎల్లోకి వచ్చిన సంగతి మరువరాదు. అతను 40వ పడిలో ఉన్న సంగతీ గుర్తుంచుకోవాలి. శుక్రవారం మ్యాచ్ విషయానికి వస్తే.. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. తర్వాత 14 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. టైమింగ్ కుదరక షాట్లు ఆడలేకపోయాడు. ఇప్పుడు అంచనాలకు తగ్గట్లు ఆడనంత మాత్రాన అతడి గతాన్ని మరిచిపోయి తిట్టేయడం ఎంతమాత్రం సరికాదు. ఇది ఫ్రాంఛైజీ క్రికెట్. తమకు అవసరం లేదనుకుంటే సీఎస్కేనే ధోనీని తప్పించేస్తుంది. కాబట్టి ధోని విషయంలో జనాలు ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరమైతే లేదు.
This post was last modified on October 3, 2020 3:33 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…