తన కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిని, ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్లు ఆడలేక రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్కు పరిమితం అయిన అతడికి.. ఇక్కడా పరిస్థితులు అనుకూలించడం లేదు. రిటైర్మెంట్తో బరువు దించేసుకున్న అతను.. ఐపీఎల్లో తన సత్తా చూపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పట్లేదు.
ఓవైపు చెన్నై జట్టు ఆశించిన ప్రదర్శన చేయట్లేదు. మరోవైపు వ్యక్తిగతంగా ధోని కూడా రాణించలేకపోతున్నాడు. దీంతో అభిమానులకు మునుపెన్నడూ చూడని విధంగా నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాడు ధోని. శుక్రవారం రాత్రి సన్రైజర్స్-చెన్నై మ్యాచ్లో అది స్పష్టంగా కనిపించింది. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ బంతిని సరిగా హిట్ చేయలేక, వేగంగా ఆడలేక ధోని ఇబ్బంది పడ్డాడు. దీనికి తోడు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయింది చెన్నై.
ఐతే తర్వాతి మ్యాచ్లో చెన్నై బలంగా పుంజుకుంటుందని, ధోని కూడా ఊపందుకుంటాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సన్రైజర్స్ చేతిలో చెన్నై ఓడిపోయింది. ధోని మరోసారి హిట్టింగ్ చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్ల్లో మాదిరే ముందు బంతులు వృథా చేసి చివర్లో హిట్ చేసే ప్రయత్నం చేశాడు. అది వర్కవుట్ కాలేదు. ధోని ఒంట్లో ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. చాలా అలసిపోయినట్లు, ఫిట్నెస్ దెబ్బ తిన్నట్లుగా అగుపించాడు. వికెట్ల మధ్య పరుగు తీయలేక ఆయాసపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా చూసి ధోని పనైపోయిందని, అతను వేస్ట్ అని కొందరు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. ధోనీని ట్రోల్ చేస్తున్నారు.
కానీ ఏడాదికిపైగా విరామం తర్వాత, పెద్దగా ప్రాక్టీస్ లేకుండా ధోని ఐపీఎల్లోకి వచ్చిన సంగతి మరువరాదు. అతను 40వ పడిలో ఉన్న సంగతీ గుర్తుంచుకోవాలి. శుక్రవారం మ్యాచ్ విషయానికి వస్తే.. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. తర్వాత 14 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. టైమింగ్ కుదరక షాట్లు ఆడలేకపోయాడు. ఇప్పుడు అంచనాలకు తగ్గట్లు ఆడనంత మాత్రాన అతడి గతాన్ని మరిచిపోయి తిట్టేయడం ఎంతమాత్రం సరికాదు. ఇది ఫ్రాంఛైజీ క్రికెట్. తమకు అవసరం లేదనుకుంటే సీఎస్కేనే ధోనీని తప్పించేస్తుంది. కాబట్టి ధోని విషయంలో జనాలు ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరమైతే లేదు.
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…