ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు.
ఒక మ్యాచ్లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్లో వేస్ట్ అనిపించే టీం ఇంకో మ్యాచ్లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ను టోర్నీ ఆరంభానికి ముందు అందరూ తీసిపడేశారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో మంచి ఊపు మీద కనిపించిన చెన్నై, పంజాబ్ జట్లను ఓడించింది. ఇక బుధవారం కోల్కతాతో మ్యాచ్లో రాయల్స్ను అందరూ ఫేవరెట్గా పరిగణిస్తే.. కోల్కతా చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. తొలి మ్యాచ్లో ముంబయి జట్టు చెన్నై చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆపై ఢిల్లీ ఏమో సన్రైజర్స్ చేతిలో ఓడింది. ఈ సన్రైజర్స్ జట్టు అంతకుముందు బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఆ బెంగళూరు దానికంటే ముందు పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. పంజాబ్ ఏమో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ చూస్తే ఇప్పుడు కోల్కతాకు తలవంచింది. కోల్కతా అంతకుముందు ముంబయి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముంబయితో మొదలై ముంబయితో ముగిసిన ఈ సైకిల్ గమనిస్తూ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరని.. మున్ముందు కూడా ఎన్నో హోరాహోరీ పోరాటాలు, అనూహ్య ఫలితాలు చూడబోతున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 1, 2020 12:29 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…