ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు.
ఒక మ్యాచ్లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్లో వేస్ట్ అనిపించే టీం ఇంకో మ్యాచ్లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ను టోర్నీ ఆరంభానికి ముందు అందరూ తీసిపడేశారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో మంచి ఊపు మీద కనిపించిన చెన్నై, పంజాబ్ జట్లను ఓడించింది. ఇక బుధవారం కోల్కతాతో మ్యాచ్లో రాయల్స్ను అందరూ ఫేవరెట్గా పరిగణిస్తే.. కోల్కతా చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. తొలి మ్యాచ్లో ముంబయి జట్టు చెన్నై చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆపై ఢిల్లీ ఏమో సన్రైజర్స్ చేతిలో ఓడింది. ఈ సన్రైజర్స్ జట్టు అంతకుముందు బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఆ బెంగళూరు దానికంటే ముందు పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. పంజాబ్ ఏమో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ చూస్తే ఇప్పుడు కోల్కతాకు తలవంచింది. కోల్కతా అంతకుముందు ముంబయి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముంబయితో మొదలై ముంబయితో ముగిసిన ఈ సైకిల్ గమనిస్తూ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరని.. మున్ముందు కూడా ఎన్నో హోరాహోరీ పోరాటాలు, అనూహ్య ఫలితాలు చూడబోతున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 1, 2020 12:29 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…