ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు.
ఒక మ్యాచ్లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్లో వేస్ట్ అనిపించే టీం ఇంకో మ్యాచ్లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ను టోర్నీ ఆరంభానికి ముందు అందరూ తీసిపడేశారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో మంచి ఊపు మీద కనిపించిన చెన్నై, పంజాబ్ జట్లను ఓడించింది. ఇక బుధవారం కోల్కతాతో మ్యాచ్లో రాయల్స్ను అందరూ ఫేవరెట్గా పరిగణిస్తే.. కోల్కతా చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. తొలి మ్యాచ్లో ముంబయి జట్టు చెన్నై చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆపై ఢిల్లీ ఏమో సన్రైజర్స్ చేతిలో ఓడింది. ఈ సన్రైజర్స్ జట్టు అంతకుముందు బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఆ బెంగళూరు దానికంటే ముందు పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. పంజాబ్ ఏమో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ చూస్తే ఇప్పుడు కోల్కతాకు తలవంచింది. కోల్కతా అంతకుముందు ముంబయి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముంబయితో మొదలై ముంబయితో ముగిసిన ఈ సైకిల్ గమనిస్తూ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరని.. మున్ముందు కూడా ఎన్నో హోరాహోరీ పోరాటాలు, అనూహ్య ఫలితాలు చూడబోతున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 1, 2020 12:29 pm
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు…
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…