ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు.
ఒక మ్యాచ్లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్లో వేస్ట్ అనిపించే టీం ఇంకో మ్యాచ్లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ను టోర్నీ ఆరంభానికి ముందు అందరూ తీసిపడేశారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో మంచి ఊపు మీద కనిపించిన చెన్నై, పంజాబ్ జట్లను ఓడించింది. ఇక బుధవారం కోల్కతాతో మ్యాచ్లో రాయల్స్ను అందరూ ఫేవరెట్గా పరిగణిస్తే.. కోల్కతా చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. తొలి మ్యాచ్లో ముంబయి జట్టు చెన్నై చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆపై ఢిల్లీ ఏమో సన్రైజర్స్ చేతిలో ఓడింది. ఈ సన్రైజర్స్ జట్టు అంతకుముందు బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఆ బెంగళూరు దానికంటే ముందు పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. పంజాబ్ ఏమో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ చూస్తే ఇప్పుడు కోల్కతాకు తలవంచింది. కోల్కతా అంతకుముందు ముంబయి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముంబయితో మొదలై ముంబయితో ముగిసిన ఈ సైకిల్ గమనిస్తూ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరని.. మున్ముందు కూడా ఎన్నో హోరాహోరీ పోరాటాలు, అనూహ్య ఫలితాలు చూడబోతున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 1, 2020 12:29 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…