యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ తీరే వేరు. తన అత్యుత్సాహంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా అతను వార్తల్లో నిలుస్తుంటాడు. విజయ్ దేవరకొండ స్టైల్ను అనుకరిస్తూ పాపులర్ కావడానికి ప్రయత్నించిన అతను.. ఆ తర్వాత అతణ్నే టార్గెట్ చేస్తూ ‘ఫలక్ నుమా దాస్’ ఆడియో వేడుకలో అతి చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.
దాని ప్రభావం ‘ఫలక్నుమా దాస్’ సినిమా ఫలితం మీదా పడింది. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో విశ్వక్సేస్ మాటలు హద్దులు దాటుతూనే ఉన్నాయి. ఆ సంగతి వదిలిపెడితే.. తాజాగా అతను జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేశాడు.
ఒక మాస్ బీట్ తీసుకుని ఓవైపు ఎన్టీఆర్ ఎలివేషన్లకు ఇస్తూనే తనకు తాను కూడా బాగానే డబ్బా కొట్టుకున్నాడందులో. కొందరు ఈ వీడియో చూసి ఇది ఎన్టీఆర్కు ట్రిబ్యూటా.. విశ్వక్సేన్ తనకు తాను ఇచ్చుకున్న ఎలివేషనా అంటూ కౌంటర్లు కూడా వేశారు.
మొత్తానికి ఈ ట్రిబ్యూట్ సాంగ్కు సోషల్ మీడియాలో ఆశించిన స్పందన అయితే రాలేదు. అది చాలదన్నట్లు ఈ పాట చుట్టూ ఓ వివాదం కూడా ముసురుకుందిప్పుడు. ఈ పాటను కంపోజ్ చేసింది ‘ఫలక్నుమా దాస్’ సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ఆ సినిమా కోసమే అతనా పాటను ట్యూన్ చేసినట్లున్నాడు. ఐతే కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టేశారు.
ఐతే ఇప్పుడు వివేక్ అనుమతి లేకుండా విశ్వక్సేన్ ఆ పాటను ఎన్టీఆర్ కోసం వాడేశాడు. ఇది అతడికి కోపం తెప్పించింది. ఈ పాట గ్లింప్స్ చూసినప్పటి నుంచే వివేక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. పాట రిలీజయ్యాక కూడా దీన్ని ఆపేయాలని అతను పలుమార్లు చెప్పినా విశ్వక్సేన్ పట్టించుకోలేదట.
యూట్యూబ్లో ఈ పాట లింక్ కింద కామెంట్ సెక్షన్లో వివేక్ స్పష్టంగా ఈ విషయాన్ని వివరించాడు. విశ్వక్ తీరును తప్పుబట్టాడు. సంగీత దర్శకుడు వద్దన్నాక కూడా విశ్వక్ ఇంత మొండిగా ఈ పాటను ఎలా రిలీజ్ చేశాడో మరి.
This post was last modified on May 22, 2020 12:44 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…