యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ తీరే వేరు. తన అత్యుత్సాహంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా అతను వార్తల్లో నిలుస్తుంటాడు. విజయ్ దేవరకొండ స్టైల్ను అనుకరిస్తూ పాపులర్ కావడానికి ప్రయత్నించిన అతను.. ఆ తర్వాత అతణ్నే టార్గెట్ చేస్తూ ‘ఫలక్ నుమా దాస్’ ఆడియో వేడుకలో అతి చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.
దాని ప్రభావం ‘ఫలక్నుమా దాస్’ సినిమా ఫలితం మీదా పడింది. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో విశ్వక్సేస్ మాటలు హద్దులు దాటుతూనే ఉన్నాయి. ఆ సంగతి వదిలిపెడితే.. తాజాగా అతను జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేశాడు.
ఒక మాస్ బీట్ తీసుకుని ఓవైపు ఎన్టీఆర్ ఎలివేషన్లకు ఇస్తూనే తనకు తాను కూడా బాగానే డబ్బా కొట్టుకున్నాడందులో. కొందరు ఈ వీడియో చూసి ఇది ఎన్టీఆర్కు ట్రిబ్యూటా.. విశ్వక్సేన్ తనకు తాను ఇచ్చుకున్న ఎలివేషనా అంటూ కౌంటర్లు కూడా వేశారు.
మొత్తానికి ఈ ట్రిబ్యూట్ సాంగ్కు సోషల్ మీడియాలో ఆశించిన స్పందన అయితే రాలేదు. అది చాలదన్నట్లు ఈ పాట చుట్టూ ఓ వివాదం కూడా ముసురుకుందిప్పుడు. ఈ పాటను కంపోజ్ చేసింది ‘ఫలక్నుమా దాస్’ సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ఆ సినిమా కోసమే అతనా పాటను ట్యూన్ చేసినట్లున్నాడు. ఐతే కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టేశారు.
ఐతే ఇప్పుడు వివేక్ అనుమతి లేకుండా విశ్వక్సేన్ ఆ పాటను ఎన్టీఆర్ కోసం వాడేశాడు. ఇది అతడికి కోపం తెప్పించింది. ఈ పాట గ్లింప్స్ చూసినప్పటి నుంచే వివేక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. పాట రిలీజయ్యాక కూడా దీన్ని ఆపేయాలని అతను పలుమార్లు చెప్పినా విశ్వక్సేన్ పట్టించుకోలేదట.
యూట్యూబ్లో ఈ పాట లింక్ కింద కామెంట్ సెక్షన్లో వివేక్ స్పష్టంగా ఈ విషయాన్ని వివరించాడు. విశ్వక్ తీరును తప్పుబట్టాడు. సంగీత దర్శకుడు వద్దన్నాక కూడా విశ్వక్ ఇంత మొండిగా ఈ పాటను ఎలా రిలీజ్ చేశాడో మరి.
This post was last modified on May 22, 2020 12:44 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…