ప్రెస్ రిలీజ్

కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ట్రోఫీలు అందించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌, శ్రీహాన్‌ సినీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో డాక్టర్స్‌ టీమ్‌ విజేతగా నిలిచింది.

కరోనా కష్టకాలంలో నిరంతరం సేవ చేసిన డాక్టర్లకు, సివిల్‌ సర్వీస్‌ అధికారులకు వీరితో పాటు సినీ నటులకు మానసిక, శారీరక ఉపశమనం కోసం ఉద్దేశించిన క్రికెట్‌ మ్యాచ్‌ శంకర్‌పల్లిలోని జన్వాడ వద్ద గల ఏక్తా స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ హాజరై వారితో కలిసి క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు.

అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.

డాక్టర్స్‌ టీమ్‌కు డాక్టర్‌ కార్తికేయ కెప్టెన్‌గా, సినీ హీరోల టీమ్‌కు హీరో తరుణ్‌ కెప్టెన్‌గా, సివిల్‌ అధికారుల టీమ్‌కు సుమిత్‌ శర్మ ఐఆర్‌ఎస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌కు ముందు మూడు జట్ల సభ్యులతో కలిసి సంతోష్‌ కుమార్‌ మొక్కలు నాటారు.

క్రికెట్‌ మ్యాచ్‌లకు సమన్వయ కర్తలుగా సుబ్బరాజు, చంద్రప్రియ సుబుద్ధి, డాక్టర్‌ ధీరజ్‌, అడిషనల్‌ డీసీపీ సందీప్‌, రాఘవ వ్యవహరించారు. బహుమతిగా వచ్చిన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలను.. శాఖాహారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య శ్రీనివాస్‌ బృందానికి అందజేశారు.

This post was last modified on March 3, 2021 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

6 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

6 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

9 hours ago