ప్రెస్ రిలీజ్

కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ట్రోఫీలు అందించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌, శ్రీహాన్‌ సినీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో డాక్టర్స్‌ టీమ్‌ విజేతగా నిలిచింది.

కరోనా కష్టకాలంలో నిరంతరం సేవ చేసిన డాక్టర్లకు, సివిల్‌ సర్వీస్‌ అధికారులకు వీరితో పాటు సినీ నటులకు మానసిక, శారీరక ఉపశమనం కోసం ఉద్దేశించిన క్రికెట్‌ మ్యాచ్‌ శంకర్‌పల్లిలోని జన్వాడ వద్ద గల ఏక్తా స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ హాజరై వారితో కలిసి క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు.

అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.

డాక్టర్స్‌ టీమ్‌కు డాక్టర్‌ కార్తికేయ కెప్టెన్‌గా, సినీ హీరోల టీమ్‌కు హీరో తరుణ్‌ కెప్టెన్‌గా, సివిల్‌ అధికారుల టీమ్‌కు సుమిత్‌ శర్మ ఐఆర్‌ఎస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌కు ముందు మూడు జట్ల సభ్యులతో కలిసి సంతోష్‌ కుమార్‌ మొక్కలు నాటారు.

క్రికెట్‌ మ్యాచ్‌లకు సమన్వయ కర్తలుగా సుబ్బరాజు, చంద్రప్రియ సుబుద్ధి, డాక్టర్‌ ధీరజ్‌, అడిషనల్‌ డీసీపీ సందీప్‌, రాఘవ వ్యవహరించారు. బహుమతిగా వచ్చిన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలను.. శాఖాహారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య శ్రీనివాస్‌ బృందానికి అందజేశారు.

This post was last modified on March 3, 2021 1:26 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

8 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

9 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

10 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

10 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

11 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

11 hours ago