హైదరాబాద్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీహాన్ సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్ వారియర్స్ క్రికెట్ మ్యాచ్లో డాక్టర్స్ టీమ్ విజేతగా నిలిచింది.
కరోనా కష్టకాలంలో నిరంతరం సేవ చేసిన డాక్టర్లకు, సివిల్ సర్వీస్ అధికారులకు వీరితో పాటు సినీ నటులకు మానసిక, శారీరక ఉపశమనం కోసం ఉద్దేశించిన క్రికెట్ మ్యాచ్ శంకర్పల్లిలోని జన్వాడ వద్ద గల ఏక్తా స్పోర్ట్స్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ హాజరై వారితో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.
అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.
డాక్టర్స్ టీమ్కు డాక్టర్ కార్తికేయ కెప్టెన్గా, సినీ హీరోల టీమ్కు హీరో తరుణ్ కెప్టెన్గా, సివిల్ అధికారుల టీమ్కు సుమిత్ శర్మ ఐఆర్ఎస్ కెప్టెన్గా వ్యవహరించారు. మ్యాచ్కు ముందు మూడు జట్ల సభ్యులతో కలిసి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
క్రికెట్ మ్యాచ్లకు సమన్వయ కర్తలుగా సుబ్బరాజు, చంద్రప్రియ సుబుద్ధి, డాక్టర్ ధీరజ్, అడిషనల్ డీసీపీ సందీప్, రాఘవ వ్యవహరించారు. బహుమతిగా వచ్చిన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలను.. శాఖాహారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య శ్రీనివాస్ బృందానికి అందజేశారు.
This post was last modified on March 3, 2021 1:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…