ప్రెస్ రిలీజ్

కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ట్రోఫీలు అందించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌, శ్రీహాన్‌ సినీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్‌ వారియర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో డాక్టర్స్‌ టీమ్‌ విజేతగా నిలిచింది.

కరోనా కష్టకాలంలో నిరంతరం సేవ చేసిన డాక్టర్లకు, సివిల్‌ సర్వీస్‌ అధికారులకు వీరితో పాటు సినీ నటులకు మానసిక, శారీరక ఉపశమనం కోసం ఉద్దేశించిన క్రికెట్‌ మ్యాచ్‌ శంకర్‌పల్లిలోని జన్వాడ వద్ద గల ఏక్తా స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ హాజరై వారితో కలిసి క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు.

అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.

డాక్టర్స్‌ టీమ్‌కు డాక్టర్‌ కార్తికేయ కెప్టెన్‌గా, సినీ హీరోల టీమ్‌కు హీరో తరుణ్‌ కెప్టెన్‌గా, సివిల్‌ అధికారుల టీమ్‌కు సుమిత్‌ శర్మ ఐఆర్‌ఎస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌కు ముందు మూడు జట్ల సభ్యులతో కలిసి సంతోష్‌ కుమార్‌ మొక్కలు నాటారు.

క్రికెట్‌ మ్యాచ్‌లకు సమన్వయ కర్తలుగా సుబ్బరాజు, చంద్రప్రియ సుబుద్ధి, డాక్టర్‌ ధీరజ్‌, అడిషనల్‌ డీసీపీ సందీప్‌, రాఘవ వ్యవహరించారు. బహుమతిగా వచ్చిన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలను.. శాఖాహారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య శ్రీనివాస్‌ బృందానికి అందజేశారు.

This post was last modified on March 3, 2021 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

18 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

58 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago