అంచనాలు నిజమయ్యాయి. లెక్క వేసుకున్నట్లే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సోదరి వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నట్లుగా మంగళవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఉప ఎన్నికల జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో గాంధీ కుటుంబానికి చెందిన మరో వారసురాలు ఎన్నికల బరిలోకి దిగినట్లైంది. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి ప్రియాంక దిగటం ఇదే తొలిసారి. ఈ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేయటం.. రెండు స్థానాల్లోనూ విజయం సాధించటం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.
రాయబరేలీతో పోలిస్తే వయనాడ్ ను వదులుకోవటమే మంచిదన్న నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్.. అందుకుతగ్గట్లే తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో.. వయనాడ్ ను వదులుకున్న రాహుల్ కు ప్రత్యామ్నాయంగా వేరే వారిని బరిలోకి దింపే కన్నా.. రాహుల్ సోదరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం మీద వారికున్న అభిమానం అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలో ప్రియాంక గెలుపు పెద్ద కష్టమైనది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. వయనాడ్ లో ప్రియాంక గెలుపొందితే.. ఆమె తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టనున్నారు. అదే జరిగితే.. మరో అరుదైన సీన్ పార్లమెంటులో చోటు చేసుకోనుంది. ముగ్గురు గాంధీలు ఒకే సందర్భంలో పార్లమెంట్ హౌస్ లో కనిపిస్తారు. ఇప్పటివరకు అలాంటి సీన్ ఎప్పుడూ చోటు చేసుకున్నది లేదు. దీంతో ప్రియాంక గెలుపు కాంగ్రెస్ కు అత్యంత కీలకం కానుంది.
రాహుల్ ను అభిమానించి.. ఆరాధించిన వయనాడ్ ప్రజలను.. ఆ ఓటర్లను దూరం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకే తమ కుటుంబానికి చెందిన వ్యక్తిని రాహుల్ కు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. తొలిసారి ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తుది ఫలితంపై బోలెడంత ఆసక్తి నెలకొంది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 16, 2024 10:53 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…