Political News

పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశా..:  జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తాను ‘తోపుగా’ అభివ‌ర్ణించుకున్న జ‌గ్గారెడ్డి.. రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటే త‌ప్పులేద న్నారు. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ్గారెడ్డి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఏ నాయ‌కుడికైనా పార్టీకైనా ఓట‌మి అనేక పాఠాలు నేర్పిస్తుంద‌ని తెలిపారు. అయితే.. తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

తాను బ‌ల‌హీనుడిని కాద‌ని.. అత్యంత బ‌ల‌వంతుడిన‌ని చెప్పుకొచ్చారు. ఎవ‌రికీ అదిరి, బెదిరి బ‌తికే మ‌న‌స్తత్వం త‌న‌కు లేద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు తానే.. తోపునని చెప్పుకొన్నారు. జ‌గ్గారెడ్డి అంటే.. ఓ ఫైట‌ర్‌. దీనిలో మ‌రో మాటే లేద‌న్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి త‌మ కుటుంబం ఎంతో రుణ ప‌డిపోయింద‌న్నారు. తాను ఓడిపోయినా.. త‌న స‌తీమ‌ణికి ఆయ‌న కార్పొరేష‌న్ ప‌దవిని ఇచ్చి గౌర‌వించార‌ని, పార్టీలోనూ త‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా గ‌త విష‌యాల‌నుజ‌గ్గారెడ్డి ప్ర‌స్తావించారు. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను దూకుడుగా వ్య‌వ‌హ‌రించాన‌ని చెప్పారు. అప్ప‌టి ఎస్పీ అనుచ‌రుల‌ను కూడా కొట్టిన‌ట్టు తెలిపారు. అంతేకాదు.. ఎస్పీ కారును కూడా త‌న కారుతో ఢీ కొట్టించాన‌న్నారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లోనే రిగ్గింగ్ చేశాన‌ని.. త‌న‌ను ఎవ‌రూ ఆపేవారు లేర‌ని చెప్పారు. అయితే.. ఈ క్ర‌మంలోనే జ‌గ్గారెడ్డి వైరాగ్యం వ్య‌క్తం చేస్తూ.. ఇంత చేసినా ఏదో ఒక రోజు కాటికి వెళ్లాల్సిందేన‌న్నారు.

ఎన్నిక‌ల‌కు రాం రాం..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీచేయ‌డం లేద‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భార్య నిర్మ‌ల రంగం లోకి దిగుతుంద‌న్నారు. ఇక‌, బీఆర్ ఎస్ నేత‌ల‌పై నిప్పులు చెరుగుతూ.. రుణ‌మాఫీని పూర్తి చేసినా.. కొంద రు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. వారికి ప్ర‌చారం ఎక్కువ‌, మాకు ప‌ని ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విష‌యంలో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్ ద‌గ్గ‌ర లెక్క‌లు ఉంటే చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ రువ్వారు. 

This post was last modified on October 13, 2024 6:46 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago