ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. విపక్షంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల్లో విపక్షంగా వైసీపీ సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్రశ్న. సహజంగానే ఏ పార్టీ అయినా.. వారాలు, నెలల లెక్కలో తమను తాము భేరీజు వేసుకుంటుంది. ఇలా చూసుకుంటే.. అధికారంలో ఉన్న కూటమి పార్టీలు.. తమ విజయాలను తాము నెమరు వేసుకుంటున్నాయి. వరదలపై విజయం, పలు వివాదాస్పద చట్టాల రద్దు, అదేవిధంగా ప్రఖ్యాత కంపెనీలను వెనక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టాయి.
మరీ ముఖ్యంగా పెంచిన పింఛన్ను అమలు చేయడం కూడా కూటమి పార్టీలుసాధించిన విజయంగానే ఉంది. దీనికి తోడు జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పంచాయతీలను బలోపేతం చేస్తున్నారు. బీజేపీ కూడా తన వ్యూహం ప్రకారం ముందుకు సాగుతోంది. ఇలా.. మూడు పార్టీలు విజయా లపై ఒక స్పష్టమైన పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటుండడం గమనార్హం.
ఇక, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ విషయానికి వస్తే.. ఏమేరకు ఈ పార్టీ విజయదశమిని నిర్వహించుకుంటోందన్న విషయం ప్రశ్నగానే మారింది. వంద రోజుల్లో ఆశించిన మేరకు జగన్ పూర్తిస్థాయిలో ప్రజల మధ్యకు రాలేకపోయారు. విపత్తులు వచ్చినా.. పలు చోట్ల బాలికలపై అఘాయిత్యాలు జరిగినా.. ఆయన తాడేపల్లికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. పార్టీ నాయకులు కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉంటే.. వారి కుటుంబాల తోనూ ఆయన భేటీ కాలేక పోతున్నారు. ఏదో జైలుకు వెళ్లి పరామర్శించి చేతులు దులుపుకొంటున్నారు.
మరోవైపు.. పార్టీని సంస్థాగతంగా ముందుకు నడిపించేందుకు కూడా జగన్ పెద్దగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈ పరిణామాలతో వైసీపీ ప్రతిపక్షంగా ఉండి సాధించిన విజయం అంటూ ఏమీ కనిపించలేదు. ఏం జరిగినా.. ట్వీట్ రూపంలో స్పందించడం మరింత మైనస్ అయిపోయింది. రాష్ట్రంలో ట్విట్టర్ను ఫాలో అయ్యేవారు 1 శాతంలోపే ఉంటారు. వారు కూడా పదే పదే చూడరు. అయినా.. జగన్ ట్విట్టర్లోనే రాజకీయాలకు పరిమితం అయ్యారు. మొత్తంగా ఈ 100 రోజుల విపక్షంలో ఆయన ప్రధానప్రతిపక్ష హోదా పొందలేక పోయారు. ప్రజలకు కూడా చేరువ కాలేక పోయారు.
This post was last modified on October 13, 2024 10:35 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…