ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. విపక్షంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల్లో విపక్షంగా వైసీపీ సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్రశ్న. సహజంగానే ఏ పార్టీ అయినా.. వారాలు, నెలల లెక్కలో తమను తాము భేరీజు వేసుకుంటుంది. ఇలా చూసుకుంటే.. అధికారంలో ఉన్న కూటమి పార్టీలు.. తమ విజయాలను తాము నెమరు వేసుకుంటున్నాయి. వరదలపై విజయం, పలు వివాదాస్పద చట్టాల రద్దు, అదేవిధంగా ప్రఖ్యాత కంపెనీలను వెనక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టాయి.
మరీ ముఖ్యంగా పెంచిన పింఛన్ను అమలు చేయడం కూడా కూటమి పార్టీలుసాధించిన విజయంగానే ఉంది. దీనికి తోడు జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పంచాయతీలను బలోపేతం చేస్తున్నారు. బీజేపీ కూడా తన వ్యూహం ప్రకారం ముందుకు సాగుతోంది. ఇలా.. మూడు పార్టీలు విజయా లపై ఒక స్పష్టమైన పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటుండడం గమనార్హం.
ఇక, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ విషయానికి వస్తే.. ఏమేరకు ఈ పార్టీ విజయదశమిని నిర్వహించుకుంటోందన్న విషయం ప్రశ్నగానే మారింది. వంద రోజుల్లో ఆశించిన మేరకు జగన్ పూర్తిస్థాయిలో ప్రజల మధ్యకు రాలేకపోయారు. విపత్తులు వచ్చినా.. పలు చోట్ల బాలికలపై అఘాయిత్యాలు జరిగినా.. ఆయన తాడేపల్లికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. పార్టీ నాయకులు కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉంటే.. వారి కుటుంబాల తోనూ ఆయన భేటీ కాలేక పోతున్నారు. ఏదో జైలుకు వెళ్లి పరామర్శించి చేతులు దులుపుకొంటున్నారు.
మరోవైపు.. పార్టీని సంస్థాగతంగా ముందుకు నడిపించేందుకు కూడా జగన్ పెద్దగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈ పరిణామాలతో వైసీపీ ప్రతిపక్షంగా ఉండి సాధించిన విజయం అంటూ ఏమీ కనిపించలేదు. ఏం జరిగినా.. ట్వీట్ రూపంలో స్పందించడం మరింత మైనస్ అయిపోయింది. రాష్ట్రంలో ట్విట్టర్ను ఫాలో అయ్యేవారు 1 శాతంలోపే ఉంటారు. వారు కూడా పదే పదే చూడరు. అయినా.. జగన్ ట్విట్టర్లోనే రాజకీయాలకు పరిమితం అయ్యారు. మొత్తంగా ఈ 100 రోజుల విపక్షంలో ఆయన ప్రధానప్రతిపక్ష హోదా పొందలేక పోయారు. ప్రజలకు కూడా చేరువ కాలేక పోయారు.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…