Political News

ఏపీ మ‌ద్యం ద‌ర‌ఖాస్తుల్లో ఇంత మ‌త‌ల‌బు జ‌రిగిందా..!

తాజాగా ఏపీలో నూత‌న‌ మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ముగిసింది. ఆశించిన దానికంటే.. 10 శాతం త‌క్కువ‌గానే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. నిజానికి ఈ మ‌ద్యం పాల‌సీతో..ద‌ర‌ఖాస్తుల రూపంలోనే స‌ర్కారు 2500 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే నిధులు స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. అందుకే.. గ‌తంలో లేని విధంగా ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.200000గా నిర్ణ‌యించింది. దీనిని దుకాణం పెట్టుకునే అవ‌కాశం వ‌చ్చినా.. రాకున్నా.. తిరిగి చెల్లించ‌రు.

ఇలా..మొత్తం ల‌క్ష‌కు పైగానే ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని లెక్క‌గ‌ట్టుకున్నారు. కానీ, 89 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చా యి. స‌రే.. ఆశించిన దానికంటే కొంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని అంటున్నారు. ఇది ఎలా ఉన్నా.. ఎవ‌రూ త‌క్కువ కారు.. త‌క్క‌వుగా లేరు! అని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు మ‌ద్యందుకాణాల ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రి యకు సంబంధించి చేస్తున్న కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. స‌హ‌జంగా మ‌ద్యం వ్యాపారం అంటేనే రాజ‌కీయ నేత‌ల‌కు పాడికుండ‌. దీంతో వ‌చ్చిన అవ‌కాశంఎందుకు వ‌దులుకుంటారు?

ఇదే ఇప్పుడు జ‌రిగింది. ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ నుంచే నాయ‌కులు జోక్యం చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తు దారుల‌ను క‌ట్ట‌డి చేశారు. ఎక్క‌వ‌గా పోటీ ప‌డితే.. రేపు లాట‌రీలో త‌మ పేరు వ‌స్తుందో రాదో అనే బెంగ కొంత‌మందిని వెంటాడింది. దీంతో వారంతా.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కులు మాత్రమే జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అనుకుంటే పొర‌పాటే. తొలిసారి జెండా ప‌ట్టుకున్న‌వారు.. తొలిసారి గెలిచిన వారు కూడా.. జోక్యం చేసుకుని.. బాగానే పోగేసుకున్నార‌న్న‌ది టాక్‌.

నీకిది-నాక‌ది త‌ర‌హాలో ముక్కు మాత్ర‌మే కాదు.. చెవులు కూడా పిండేసి.. ఒప్పందాలు చేసేసుకున్నార న్న‌ది టీడీపీలోనే వినిపిస్తున్న మాట‌. నెల‌కు 25 % క‌మీష‌న్‌, ఆరు మాసాల‌కు ముడుపులు, అతిథులు (పెద్ద‌నేత‌లు) నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌స్తే.. పూర్తి ఖ‌ర్చు.. ఇలా కీల‌క నాయ‌కులు లెక్క‌లు వేసుకుని ముందుగా నే ద‌ర‌ఖాస్తు దారుల‌తో లిఖిత పూర్వ‌క ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విష‌యంలో టీడీపీ అనుకూల మీడియాకే తెలిసిపోయిందంటే.. ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు.. అనంత‌పురంలో అయితే.. మ‌హిళా నాయ‌కులే.. చ‌క్క బెట్టేశారంటే ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో తెలుస్తుంది.

This post was last modified on October 12, 2024 7:50 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

25 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

13 hours ago