ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న పలువురు కేడర్ ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఏపీకి రాలేదు. తెలంగాణలోనే పనిచేస్తున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీకి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్లను ఏపీకే పంపించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీకి కేటాయించిన అధికారులు తక్షణమే ఏపీలో బాధ్యతలు చేపట్టాలని పేర్కొంది. అయితే.. వీరికి ఉత్తర్వులు అంది.. తట్టా బుట్టా సర్దుకునేందుకు.. ఐదు రోజుల సమయం కేటాయించింది. గతంలో కూడా.. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనను ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణలోనే కొనసాగించాలని ఆయన కోరుకున్నారు.
కానీ, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో సోమేష్ ఏపీకి తరలిరాక తప్పలేదు. అయితే.. ఆయన జగన్ హయాంలో ఇలా వచ్చి.. అలా వీఆర్ ఎస్కు అప్లయ్ చేశారు. అనంతరం. కేసీఆర్ సర్కారు(అప్పటికి ఎన్నికలు జరగలేదు) ప్రభుత్వ సలహాదారుగా బాధ్యలు చేపట్టారు. ఇదిలావుంటే, తాజా జాబితాలో కీలక అధికారులు ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరిలో సీనియర్లు ఉండడం గమనార్హం.
ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి ఉన్నారు. అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫార్ములాను ఏపీకి కూడా అమలు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన అధికారులు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. వారిని కూడా తెలంగాణకు బదిలీ చేస్తూ.. కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. వారిలో ఎస్ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి ఉన్నారు. వీరంతా ఐఏఎస్లే కావడం గమనార్హం.
This post was last modified on October 11, 2024 10:05 am
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…