విజయదశమి సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నాడు సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి అని, దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే పోలవరం, అమరావతి, ఇతర నదలు అనుసంధానం ఉంటుందని అన్నారు. ఆ పనులు త్వరగా పూర్తి కావాలని అమ్మవారిని కోరుకున్నానని చంద్రబాబు అన్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్గమ్మ దయ వల్ల వర్షాలు పడ్డాయని అన్నారు. మూలా నక్షత్రం నాడు అందరికీ ఉచిత దర్శనం, ఉచిత లడ్డూ ఇచ్చామని, అన్ని ఏర్పాట్లూ చేశామని అన్నారు. రాబయే రోజుల్లో ఆలయానికి ఆదాయం కంటే, వీఐఔపీల కలంటే భక్తుల మనోభావాల ప్రకారం ఆలయానికి సంబంధించిన నిర్ణయాలుంటాయని చెప్పారు. ప్రతి దేవాలయానికి, ప్రార్ధనా మందిరానికి పూర్వ వైభవం తెస్తామన్నారు.
ఈవీఎంల వ్యవహారంపై జగన్ ను చంద్రబాబు ఏకిపారేశారు. 2019లో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా…చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి అని జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఏదో ఒకటి మాట్లాతూ ఉండు అని జగన్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కూడా వైసీపీ నేతల మనస్తత్వం తెలియాలి…ఇళ్లు, ఆఫీసుల మీద దాడులు చేసినవారికి కేసులు పెట్టకూడదంటున్న వైసీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టం వీళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 10, 2024 11:47 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…