AP CM YS Jagan Pressmeet
కరోనా మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పెట్టిన ప్రెస్ మీట్లు ఎంతగా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేశాయో తెలిసిందే. కరోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్లు విమర్శల పాలయ్యాయి. అవి చాలవన్నట్లు కరోనా పుట్టింది కొరియాలో అంటూ తన అవగాహన లేమిని చాటుకున్నాడు. ఈ విషయాల్లో మీడియాను ఫేస్ చేయడం ఆయనకు చాలా కష్టమైంది.
ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ సోషల్ మీడియాలో జనాలు తనను ఆడేసుకుంటుండటంతో రూటు మార్చి రికార్డెడ్ వీడియోలు ప్రెస్కు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు జగన్. ఐతే తాజాగా సోమవారం మధ్యే మార్గంగా.. ప్రెస్ లేకుండా నేరుగా లైవ్లో మీడియాకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్. సాక్షి, టీవీ9 లాంటి ఛానెళ్లు ఏపీ సీఎం ప్రజలనుద్దేశించి లైవ్లో మాట్లాడుతున్నట్లు ఫీడ్ మొదలు పెట్టాయి.
ఐతే పేరుకే ఇది లైవ్ అని.. ఇది కూడా ఇంతకుముందు లాంటి రికార్డెడ్ వీడియోనే అనే విషయాన్ని సోషల్ మీడియా జనాలు బయటపెట్టేశారు. కొన్ని చోట్ల జగన్ వాయిస్ జంప్ కావడం.. దృశ్యంలో మార్పు రావడం స్పష్టంగా కనిపించింది. అది చాలదన్నట్లు లైవ్ వీడియోలో జగన్ ఒక్కో చోట ఒక్కో రకమైన టైమ్ చూపించడంతో ఇది లైవ్ కాదనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
ఒక చోట ఒంటి గంట కావస్తున్నట్లు టైం చూపించగా.. ఇంకో చోట ఏకంగా సమయం ఐదు గంటలు దాటిపోయింది. దీంతో జగన్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని.. బాగా ప్రాక్టీస్ చేసి.. టేక్ల మీద టేక్లు తీసుకుని తాపీగా ఈ మెసేజ్ ఇచ్చాడని.. కానీ చివరికిది లైవ్ అని భ్రమింపజేసే ప్రయత్నం టీవీ ఛానెళ్లు చేశాయని స్పష్టంగా తెలిసిపోయింది. దీనిపై వైకాపా వర్గాలు ఎలా డిఫెండ్ చేసుకుంటాయన్నది ఆసక్తికరం.
This post was last modified on April 28, 2020 1:00 pm
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…