తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం అనంతరం చంద్రబాబు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యనిర్వహణాధికారి(ఈవో) జె. శ్యామలరావును ఆదేశించారు. లడ్డూ ప్రసాదం నుంచి భోజన ప్రసాదాల వరకు కూడా భక్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పారు.
భక్తుల మనోభావాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని కూడా అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈవిషయంలో టైం లేదని.. పనులు ఉన్నాయని తనకు చెప్పవద్దని కూడా ఆదేశించారు. అంతే! ఈవో శ్యామలరావు రంగంలోకి దిగిపోయారు. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చేతినిండా ఊపిరి సలపనంతగా పని ఉన్నా.. ఆయన సామాన్య భక్తుల మధ్యకు వచ్చేశారు.
సోమవారం ఉదయాన్నే ఆయన పుష్కరిణి, వైకుంఠం క్యూకాంప్లెక్సులలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి భక్తుడి చెంతకు వెళ్లి.. దర్శనం నుంచి వసతుల వరకు.. లడ్డూ ప్రసాదం నుంచి అన్నసంతర్పణ, క్యూలైన్లలో ఇస్తున్న ప్రసాదాలు, ఆహారం, టీ, కాఫీ వంటి వాటి గురించి కూడా చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. ప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఆయా వివరాలను శ్యామలరావు నోట్ చేసుకున్నారు. ఇలా.. చంద్రబాబు చెప్పిన వెంటనే రంగంలో దిగి తమ అభిప్రాయాలు సేకరించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ఫిర్యాదులు-సూచనలు
This post was last modified on October 7, 2024 9:32 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…