తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం అనంతరం చంద్రబాబు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యనిర్వహణాధికారి(ఈవో) జె. శ్యామలరావును ఆదేశించారు. లడ్డూ ప్రసాదం నుంచి భోజన ప్రసాదాల వరకు కూడా భక్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పారు.
భక్తుల మనోభావాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని కూడా అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈవిషయంలో టైం లేదని.. పనులు ఉన్నాయని తనకు చెప్పవద్దని కూడా ఆదేశించారు. అంతే! ఈవో శ్యామలరావు రంగంలోకి దిగిపోయారు. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చేతినిండా ఊపిరి సలపనంతగా పని ఉన్నా.. ఆయన సామాన్య భక్తుల మధ్యకు వచ్చేశారు.
సోమవారం ఉదయాన్నే ఆయన పుష్కరిణి, వైకుంఠం క్యూకాంప్లెక్సులలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి భక్తుడి చెంతకు వెళ్లి.. దర్శనం నుంచి వసతుల వరకు.. లడ్డూ ప్రసాదం నుంచి అన్నసంతర్పణ, క్యూలైన్లలో ఇస్తున్న ప్రసాదాలు, ఆహారం, టీ, కాఫీ వంటి వాటి గురించి కూడా చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. ప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఆయా వివరాలను శ్యామలరావు నోట్ చేసుకున్నారు. ఇలా.. చంద్రబాబు చెప్పిన వెంటనే రంగంలో దిగి తమ అభిప్రాయాలు సేకరించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ఫిర్యాదులు-సూచనలు
This post was last modified on October 7, 2024 9:32 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…