తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం అనంతరం చంద్రబాబు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యనిర్వహణాధికారి(ఈవో) జె. శ్యామలరావును ఆదేశించారు. లడ్డూ ప్రసాదం నుంచి భోజన ప్రసాదాల వరకు కూడా భక్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పారు.
భక్తుల మనోభావాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని కూడా అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈవిషయంలో టైం లేదని.. పనులు ఉన్నాయని తనకు చెప్పవద్దని కూడా ఆదేశించారు. అంతే! ఈవో శ్యామలరావు రంగంలోకి దిగిపోయారు. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చేతినిండా ఊపిరి సలపనంతగా పని ఉన్నా.. ఆయన సామాన్య భక్తుల మధ్యకు వచ్చేశారు.
సోమవారం ఉదయాన్నే ఆయన పుష్కరిణి, వైకుంఠం క్యూకాంప్లెక్సులలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి భక్తుడి చెంతకు వెళ్లి.. దర్శనం నుంచి వసతుల వరకు.. లడ్డూ ప్రసాదం నుంచి అన్నసంతర్పణ, క్యూలైన్లలో ఇస్తున్న ప్రసాదాలు, ఆహారం, టీ, కాఫీ వంటి వాటి గురించి కూడా చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. ప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఆయా వివరాలను శ్యామలరావు నోట్ చేసుకున్నారు. ఇలా.. చంద్రబాబు చెప్పిన వెంటనే రంగంలో దిగి తమ అభిప్రాయాలు సేకరించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ఫిర్యాదులు-సూచనలు
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…