Political News

ష‌ర్మిల పై కేవీపీ గుర్రు..

కేవీపీ రామ‌చంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్‌వార్ట్‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి అన్నీ తానై 2004-2009 వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ప్ర‌త్య‌క్షంగా, పార్టీని ప‌రోక్షంగా న‌డిపించారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి కేవీపీనేకుడి భుజం. అందుకే వైఎస్ ఎగ‌స్పార్టీ మీడియా.. ఏకంగా కేవీపీని వైఎస్ ఆత్మ‌గా సంబోధించింది. అంత‌లా వైఎస్ కుటుంబంతో పెన‌వేసుకున్న కేవీపీకి వైఎస్‌ మ‌ర‌ణం త‌ర్వాత పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు.

జ‌గ‌న్‌తో కేవీపీ సంబంధాలు కొన‌సాగించాల‌ని చూశారు. అంతేకాదు.. అస‌లు వైసీపీని ఏర్పాటు చేయొద్ద‌ని కూడా స‌ల‌హాలు ఇచ్చారు. కానీ, జ‌గ‌న్‌కు ఇది న‌చ్చ‌లేదు. దీంతో అంటీముట్ట‌న‌ట్టే కేవీపీని ప‌క్క‌న పెట్టారు. దీంతో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌కే కొన్నాళ్లు ప‌రిమితం అయ్యారు.

ఇక‌, వైఎస్ ష‌ర్మిల‌కు ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంలోనూ కేవీపీ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆమె త‌ర‌ఫున అధిష్టానంతోనూ ప‌లు మార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

వైఎస్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు, పోయిన ఓటు బ్యాంకును(ఏపీ) తిరిగి రాబ‌ట్టుకునేందుకు ష‌ర్మిల క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని చెప్పిన వారిలో కేవీపీ ముందున్నారు. అంతేకాదు.. తొలి నాళ్ల‌లో పార్టీ అధిష్టానం అప్పాయింట్‌మెంట్ల‌ను కూడా ఆయ‌న చూశారు. ఏపీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పుడు కేవీపీ ముందుండి న‌డిపిస్తా రని.. అప్ప‌ట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు కూడా గుర్తుండే ఉంటాయి. అలాంటి కేవీపీ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ష‌ర్మిలతో విభేదిస్తున్నారు.

ముఖ్యంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసే విష‌యంలో ఆయ‌న ఒక్క అడుగు వెన‌క్కి వేయాల‌న్న‌ది ప్ర‌ధాన సూచన‌. ఇది కొంత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజం. జ‌గ‌న్‌ను తిట్టినందున ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు క‌నెక్ట్ కాబోర‌న్న‌ది కూడా ఆయ‌న మేలైన సూచ‌న. కానీ, ష‌ర్మిల ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న ఏపీ బాధ్య‌త‌ల నుంచి ప‌రోక్షంగా త‌ప్పుకొన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ష‌ర్మిల ఇదే పంథాతో ముందుకు సాగ‌డంతోపాటు.. ఏకంగా కేవీపీ పైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన‌ట్టు తాజాగా వెలుగు చూసింది.

కేవీపీ వంటి సీనియ‌ర్ల‌ను పాత నేత‌లుగా సంబోధించిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌తో కేవీపీ హ‌ర్ట్ అయ్యార‌ని.. అప్ప‌టి నుంచి ఏపీ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని తెలుస్తోంది. ఇక‌, కేవీపీకి అనుకూలంగా ఉన్న ఏపీ నేత‌లు కూడా ఇటీవ‌ల కాలంలో ష‌ర్మిల‌కు దూరంగా ఉంటున్నారు. మొత్తంగా చూస్తే.. ష‌ర్మిల వ్య‌వ‌హారంపై కేవీపీ వంటి సీనియ‌ర్లు గుర్రుగా ఉండ‌డం.. ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఇబ్బందిగా నే మారింద‌ని స‌మాచారం.

This post was last modified on October 5, 2024 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

23 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago