Political News

ష‌ర్మిల పై కేవీపీ గుర్రు..

కేవీపీ రామ‌చంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్‌వార్ట్‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి అన్నీ తానై 2004-2009 వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ప్ర‌త్య‌క్షంగా, పార్టీని ప‌రోక్షంగా న‌డిపించారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి కేవీపీనేకుడి భుజం. అందుకే వైఎస్ ఎగ‌స్పార్టీ మీడియా.. ఏకంగా కేవీపీని వైఎస్ ఆత్మ‌గా సంబోధించింది. అంత‌లా వైఎస్ కుటుంబంతో పెన‌వేసుకున్న కేవీపీకి వైఎస్‌ మ‌ర‌ణం త‌ర్వాత పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు.

జ‌గ‌న్‌తో కేవీపీ సంబంధాలు కొన‌సాగించాల‌ని చూశారు. అంతేకాదు.. అస‌లు వైసీపీని ఏర్పాటు చేయొద్ద‌ని కూడా స‌ల‌హాలు ఇచ్చారు. కానీ, జ‌గ‌న్‌కు ఇది న‌చ్చ‌లేదు. దీంతో అంటీముట్ట‌న‌ట్టే కేవీపీని ప‌క్క‌న పెట్టారు. దీంతో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌కే కొన్నాళ్లు ప‌రిమితం అయ్యారు.

ఇక‌, వైఎస్ ష‌ర్మిల‌కు ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంలోనూ కేవీపీ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆమె త‌ర‌ఫున అధిష్టానంతోనూ ప‌లు మార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

వైఎస్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు, పోయిన ఓటు బ్యాంకును(ఏపీ) తిరిగి రాబ‌ట్టుకునేందుకు ష‌ర్మిల క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని చెప్పిన వారిలో కేవీపీ ముందున్నారు. అంతేకాదు.. తొలి నాళ్ల‌లో పార్టీ అధిష్టానం అప్పాయింట్‌మెంట్ల‌ను కూడా ఆయ‌న చూశారు. ఏపీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పుడు కేవీపీ ముందుండి న‌డిపిస్తా రని.. అప్ప‌ట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు కూడా గుర్తుండే ఉంటాయి. అలాంటి కేవీపీ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ష‌ర్మిలతో విభేదిస్తున్నారు.

ముఖ్యంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసే విష‌యంలో ఆయ‌న ఒక్క అడుగు వెన‌క్కి వేయాల‌న్న‌ది ప్ర‌ధాన సూచన‌. ఇది కొంత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజం. జ‌గ‌న్‌ను తిట్టినందున ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు క‌నెక్ట్ కాబోర‌న్న‌ది కూడా ఆయ‌న మేలైన సూచ‌న. కానీ, ష‌ర్మిల ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న ఏపీ బాధ్య‌త‌ల నుంచి ప‌రోక్షంగా త‌ప్పుకొన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ష‌ర్మిల ఇదే పంథాతో ముందుకు సాగ‌డంతోపాటు.. ఏకంగా కేవీపీ పైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన‌ట్టు తాజాగా వెలుగు చూసింది.

కేవీపీ వంటి సీనియ‌ర్ల‌ను పాత నేత‌లుగా సంబోధించిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌తో కేవీపీ హ‌ర్ట్ అయ్యార‌ని.. అప్ప‌టి నుంచి ఏపీ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని తెలుస్తోంది. ఇక‌, కేవీపీకి అనుకూలంగా ఉన్న ఏపీ నేత‌లు కూడా ఇటీవ‌ల కాలంలో ష‌ర్మిల‌కు దూరంగా ఉంటున్నారు. మొత్తంగా చూస్తే.. ష‌ర్మిల వ్య‌వ‌హారంపై కేవీపీ వంటి సీనియ‌ర్లు గుర్రుగా ఉండ‌డం.. ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఇబ్బందిగా నే మారింద‌ని స‌మాచారం.

This post was last modified on October 5, 2024 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

21 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago