కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. ఎలాంటి వాడినైనా ఇట్టే ప్రభావితం చేసే సత్తా దాని సొంతం. తమ మాటకే కాదు తన చూపుకు సైతం తిరుగులేనంత పవర్ ప్రదర్శించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన వైనం వెలుగు చూసింది. తాను అమాయకుడినని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును అభ్యర్థిస్తున్న వైనం వెలుగు చూసింది.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేయటం.. విధ్వంసాన్ని క్రియేట్ చేసిన వైనంపై కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కేసు విచారణ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా.. మరికొందరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ కేసులో 120వ నిందితుడిగా గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటే.. ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డిని చేర్చారు.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారన్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారన్న ఆయన.. తనపైనా కేసు పెట్టారన్నారు. సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ నోటీసు రూల్ ప్రకారం తాను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే తనపై హత్యాయత్నం సెక్షన్ ను చేర్చారన్నారు. తాను అమాయకుడినని.. తాను కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని.. మందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసు విచారణ ఈరోజు హైకోర్టు ఎదుట రానుంది. దీనిపై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
This post was last modified on October 4, 2024 1:14 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…