Political News

లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు: సుప్రీం

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిందని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..ఈ రోజు అందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు,FSSAI నుంచి ఒక అధికారి..ఇలా మొత్తం ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు
ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి ఒక మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఉండాలని దేశపు అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక, రాజకీయ ప్రేరేపణలకు, పొలిటికల్ డ్రామాలకు ఈ వ్యవహారంలో అవకాశం ఉండకూడదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

This post was last modified on October 4, 2024 12:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ…

3 hours ago

నా భ‌వ‌నాలైనా కూల్చేయండి: రేవంత్‌కు కేపీవీ ఆఫ‌ర్‌

కేవీపీ రామ‌చంద్ర‌రావు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని దాదాపు…

6 hours ago

ప్రభాస్ పుట్టినరోజుకి ఏం ఇవ్వబోతున్నారు

ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…

7 hours ago

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో…

7 hours ago

తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…

9 hours ago

జ‌న‌సేన రైటిస్టు పార్టీగా మారిందా?: ష‌ర్మిల

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

9 hours ago