Political News

లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు: సుప్రీం

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిందని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..ఈ రోజు అందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు,FSSAI నుంచి ఒక అధికారి..ఇలా మొత్తం ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు
ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి ఒక మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఉండాలని దేశపు అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక, రాజకీయ ప్రేరేపణలకు, పొలిటికల్ డ్రామాలకు ఈ వ్యవహారంలో అవకాశం ఉండకూడదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

This post was last modified on October 4, 2024 12:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

35 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

5 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

7 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

12 hours ago