టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు. అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు. తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
కానీ, చంద్రబాబు 4.0లో మాత్రం ఆయన చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు. మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చి దిద్దుకుంటున్నారు.
ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పేదల ఇళ్లలో వారు ఆ సమయానికి ఏది ఇస్తే.. దానిని తీసుకుంటున్నారు.
కొన్ని ఇళ్లలో టీ ఇస్తే.. మరికొందరు మజ్జిగ ఇస్తు న్నారు. ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు. తాజాగా అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాస్ట్రాల్లో స్వచ్చతే సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ లోనూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మచిలీపట్నంలో నిర్వహించిన స్వ చ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి కూర్చుని.. వారు తయారు చేసిన టీనీ స్వయంగా రుచి చూశారు. వారి బాగోగులు తెలుసుకు న్నారు.
పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తెలుసుకున్నారు. వారి పక్కనే చాలా సేపు కూర్చుని వారితో మాటలు కలిపారు. టీ తాగుతూ.. వారితో ముచ్చటించారు. నిజానికి 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. తమ పక్కన కూర్చుని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు ఎంతగానో మురిసిపోయారు.
This post was last modified on October 2, 2024 6:42 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…