టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు. అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు. తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
కానీ, చంద్రబాబు 4.0లో మాత్రం ఆయన చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు. మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చి దిద్దుకుంటున్నారు.
ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పేదల ఇళ్లలో వారు ఆ సమయానికి ఏది ఇస్తే.. దానిని తీసుకుంటున్నారు.
కొన్ని ఇళ్లలో టీ ఇస్తే.. మరికొందరు మజ్జిగ ఇస్తు న్నారు. ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు. తాజాగా అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాస్ట్రాల్లో స్వచ్చతే సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ లోనూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మచిలీపట్నంలో నిర్వహించిన స్వ చ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి కూర్చుని.. వారు తయారు చేసిన టీనీ స్వయంగా రుచి చూశారు. వారి బాగోగులు తెలుసుకు న్నారు.
పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తెలుసుకున్నారు. వారి పక్కనే చాలా సేపు కూర్చుని వారితో మాటలు కలిపారు. టీ తాగుతూ.. వారితో ముచ్చటించారు. నిజానికి 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. తమ పక్కన కూర్చుని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు ఎంతగానో మురిసిపోయారు.
This post was last modified on October 2, 2024 6:42 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…