తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించినట్టు టీటీడీ అధికారులు కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆ ట్యాంకర్లను ఎవరివన్నది తేల్చిన అధికారులు సదరు నెయ్యిని పంపిన కంపెనీపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని దుండిగల్ జిల్లాకు చెందిన ‘ఏ ఆర్’ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఈ ట్యాంకర్లు సరఫరా అయ్యాయి. మొత్తంగా ఈ సంస్థ నుంచి 8 ట్యాంకర్లు రాగా.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు సరిపోలలేదని గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే ఏఆర్ సంస్థపై విమర్శలు కూడా వచ్చాయి. గత వైసీపీ హయాంలో అప్పటి వరకు కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని తిరుమలకు దిగుమతి చేసుకునేవారు. ఆ నెయ్యినే భోజనాలు, దీపారాధన, లడ్డూ ప్రసాదాలకు కూడా వినియోగించే వారు. అయితే.. వైసీపీ హయాంలో నందిని నెయ్యి కాంట్రాక్టును రద్దు చేసి.. తక్కువ ధరకే ఇస్తామని ముందుకు వచ్చిన ఏఆర్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ క్రమంలోనే కల్తీ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా.. సీరియస్ కావడం, ఈ విషయం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు.
విచారించిన పోలీసులు.. ఏఆర్ సంస్థ యాజమాన్యంపై ఆహార పదార్థాల కల్తీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సోమవారం ఈ మేరకు కేసు నమోదు చేయడంతో సంస్థ ఎండీ రాజశేఖరన్ అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు పాటించకుండానే తనపై కేసు పెట్టారని.. వాస్తవానికి ముందుగా నోటీసులు ఇచ్చి తమ వివరణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలాంటి వివరణా తీసుకోకుండానే కేసు నమోదు చేసినట్టు పిటిషన్లో వివరించారు.
ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజశేఖరన్ కోర్టును అభ్యర్థించారు. కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని పేర్కొన్నారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులకు కూడా సహకరిస్తానని తెలిపారు. దర్యాప్తు అధికారులు తనను అరెస్టు చేయకుండా, ఎలాంటి తొందర పాటు చర్యలకు దిగకుండా కూడా ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఇదిలావుంటే.. మరో వైపు సిట్ అధికారులు తిరుమలలో దర్యాప్తును ముమ్మరం చేశారు. లడ్డూ వివాదానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా విచారిస్తున్నారు. ఏ ఒక్క ఆధారాన్నీ వదలకుండా విచారిస్తున్నారు.
This post was last modified on October 1, 2024 9:05 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…