Political News

తిరుమ‌ల ల‌డ్డూ: ఏఆర్ సంస్థ‌పై తొలి కేసు న‌మోదు

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయింద‌న్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం దీనిని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. మొత్తం 4 నెయ్యి ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపించిన‌ట్టు టీటీడీ అధికారులు కూడా చెప్పారు. ఈ క్ర‌మంలో ఆ ట్యాంక‌ర్ల‌ను ఎవ‌రివ‌న్న‌ది తేల్చిన అధికారులు స‌ద‌రు నెయ్యిని పంపిన కంపెనీపై కేసు న‌మోదు చేశారు. త‌మిళ‌నాడులోని దుండిగ‌ల్ జిల్లాకు చెందిన ‘ఏ ఆర్‌’ ఇండ‌స్ట్రీస్ సంస్థ నుంచి ఈ ట్యాంక‌ర్లు స‌ర‌ఫ‌రా అయ్యాయి. మొత్తంగా ఈ సంస్థ నుంచి 8 ట్యాంక‌ర్లు రాగా.. నాలుగు ట్యాంక‌ర్ల‌లో నెయ్యి నాణ్య‌తా ప్ర‌మాణాల‌కు స‌రిపోల‌లేద‌ని గుర్తించారు.

ఈ నేప‌థ్యంలోనే ఏఆర్ సంస్థ‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. గ‌త వైసీపీ హ‌యాంలో అప్ప‌టి వ‌ర‌కు క‌ర్ణాట‌క‌కు చెందిన నందిని నెయ్యిని తిరుమ‌ల‌కు దిగుమ‌తి చేసుకునేవారు. ఆ నెయ్యినే భోజ‌నాలు, దీపారాధ‌న‌, ల‌డ్డూ ప్ర‌సాదాల‌కు కూడా వినియోగించే వారు. అయితే.. వైసీపీ హయాంలో నందిని నెయ్యి కాంట్రాక్టును ర‌ద్దు చేసి.. త‌క్కువ ధ‌ర‌కే ఇస్తామ‌ని ముందుకు వ‌చ్చిన ఏఆర్ సంస్థ‌కు కాంట్రాక్టు క‌ట్ట‌బెట్టారు. ఈ క్ర‌మంలోనే క‌ల్తీ జ‌రిగిన‌ట్టుగా అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్ర‌బాబు కూడా.. సీరియ‌స్ కావ‌డం, ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా అల‌జ‌డి సృష్టించిన నేప‌థ్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు.

విచారించిన పోలీసులు.. ఏఆర్ సంస్థ యాజ‌మాన్యంపై ఆహార ప‌దార్థాల క‌ల్తీ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేశారు. సోమ‌వారం ఈ మేర‌కు కేసు న‌మోదు చేయ‌డంతో సంస్థ ఎండీ రాజ‌శేఖ‌ర‌న్ అలెర్ట్ అయ్యారు. వెంట‌నే ఆయ‌న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై న‌మోదు చేసిన కేసు చ‌ట్ట‌బ‌ద్దంగా లేద‌ని పేర్కొన్నారు. చ‌ట్ట నిబంధ‌న‌లు పాటించ‌కుండానే త‌న‌పై కేసు పెట్టార‌ని.. వాస్త‌వానికి ముందుగా నోటీసులు ఇచ్చి త‌మ వివ‌ర‌ణ తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. కానీ, పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే ఎలాంటి వివ‌ర‌ణా తీసుకోకుండానే కేసు న‌మోదు చేసిన‌ట్టు పిటిష‌న్‌లో వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజ‌శేఖ‌ర‌న్ కోర్టును అభ్య‌ర్థించారు. కోర్టు విధించే ష‌ర‌తుల‌కు లోబ‌డి ఉంటాన‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ద‌ర్యాప్తు అధికారులకు కూడా స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు. ద‌ర్యాప్తు అధికారులు త‌న‌ను అరెస్టు చేయ‌కుండా, ఎలాంటి తొంద‌ర పాటు చ‌ర్య‌ల‌కు దిగ‌కుండా కూడా ఆదేశించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇదిలావుంటే.. మ‌రో వైపు సిట్ అధికారులు తిరుమ‌ల‌లో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. ల‌డ్డూ వివాదానికి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్నీ కూలంక‌షంగా విచారిస్తున్నారు. ఏ ఒక్క ఆధారాన్నీ వ‌ద‌ల‌కుండా విచారిస్తున్నారు.

This post was last modified on October 1, 2024 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago