ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తారని.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం సాగింది. ఆయన కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారని టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. విజయవాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మణి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఆమె ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
అయితే.. తరచుగా మాత్రం నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రంపై చర్చసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై ఆమె అత్త, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని ఆమె తెలిపారు. ఆమెకు అసలు రాజకీయాలంటే ఇష్టమేలేదన్నారు. ముఖ్యంగా రాజకీయాలంటే బ్రాహ్మణికి అస్సలు పడదని.. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. తనకు వ్యాపారం చేసుకోవడం, స్వతహాగా ఎదగడమే ఇష్టమని భువనేశ్వరి చెప్పారు.
ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో కీలక రోల్ పోషిస్తున్న బ్రాహ్మణి.. ఆ సంస్థ ఎదుగుదలలో ముందున్నారని భువనేశ్వరి వివరించారు. ఇదిలావుంటే, 2019 ఎన్నికల సమయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శించిన బ్రాహ్మణి.. మంగళగిరి నియోజకవర్గంలో తన భర్త, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఆ తర్వాత.. చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను, ముఖ్యంగా మహిళా నాయకులను కదిలించడం లోనూ బ్రాహ్మణి ముందున్నారు. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన నిరసనకు నేతృత్వం వహించారు.
ఇక, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రాహ్మణి ఇక్కడ తన భర్త గెలుపు కోసం అనేక రూపాల్లో కృషి చేశారు. ప్రతి ఒక్కరినీ కలిశారు. ప్రతి ఇంటికీ వెళ్లారు. ఇదేసమయంలో నందమూరి ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. ఇలా.. తనదైన శైలిలో బ్రాహ్మణి పరోక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న చర్చసాగింది. కానీ, ఆమెకు ప్రత్యక్ష రాజకీయాలు ఇష్టంలేదని స్వయంగా భువనేశ్వరి వెల్లడించడం గమనార్హం.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…