Political News

బ్రాహ్మ‌ణి రాజ‌కీయాల‌పై భువ‌నేశ్వ‌రి కామెంట్లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబం నుంచి మ‌రొక‌రు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు జోరుగా ప్ర‌చారం సాగింది. ఆయన కోడ‌లు, మంత్రి నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌చారం చేశారు. విజ‌య‌వాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మ‌ణి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. పెద్ద ఎత్తున వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాలేదు.

అయితే.. త‌ర‌చుగా మాత్రం నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రంపై చ‌ర్చ‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ విష‌యంపై ఆమె అత్త‌, సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ్రాహ్మ‌ణి ఎప్ప‌టికీ రాజ‌కీయాల్లోకి రాబోర‌ని ఆమె తెలిపారు. ఆమెకు అస‌లు రాజ‌కీయాలంటే ఇష్ట‌మేలేద‌న్నారు. ముఖ్యంగా రాజ‌కీయాలంటే బ్రాహ్మ‌ణికి అస్స‌లు ప‌డ‌ద‌ని.. ఈ నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం కూడా లేద‌ని చెప్పారు. త‌న‌కు వ్యాపారం చేసుకోవ‌డం, స్వ‌త‌హాగా ఎద‌గ‌డ‌మే ఇష్ట‌మ‌ని భువ‌నేశ్వ‌రి చెప్పారు.

ప్ర‌స్తుతం హెరిటేజ్ సంస్థ‌లో కీల‌క రోల్ పోషిస్తున్న బ్రాహ్మ‌ణి.. ఆ సంస్థ ఎదుగుద‌ల‌లో ముందున్నార‌ని భువ‌నేశ్వ‌రి వివ‌రించారు. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించిన బ్రాహ్మ‌ణి.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న భ‌ర్త‌, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ కోసం ప్ర‌చారం చేశారు. ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను కూడా భుజాన వేసుకున్నారు. ఆ త‌ర్వాత‌.. చంద్రబాబు అరెస్టు అయిన సంద‌ర్భంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌ను, ముఖ్యంగా మ‌హిళా నాయ‌కుల‌ను క‌దిలించ‌డం లోనూ బ్రాహ్మ‌ణి ముందున్నారు. రాష్ట్ర‌స్థాయిలో చంద్ర‌బాబు అరెస్టుకు వ్య‌తిరేకంగా సాగిన నిర‌స‌న‌కు నేతృత్వం వ‌హించారు.

ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బ్రాహ్మ‌ణి ఇక్క‌డ త‌న భ‌ర్త గెలుపు కోసం అనేక రూపాల్లో కృషి చేశారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిశారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లారు. ఇదేస‌మ‌యంలో నంద‌మూరి ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి ప్ర‌చారం చేయించారు. ఇలా.. త‌న‌దైన శైలిలో బ్రాహ్మ‌ణి ప‌రోక్ష రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలోనే బ్రాహ్మ‌ణి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌న్న చ‌ర్చ‌సాగింది. కానీ, ఆమెకు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు ఇష్టంలేద‌ని స్వ‌యంగా భువ‌నేశ్వ‌రి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 1, 2024 9:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

3 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

3 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago