జనసేన ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు.. తన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను వెనుకేసుకు వచ్చారు. హిందూ ధర్మంపై గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మిశ్రమంగా స్పందించిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిన వ్యవహారంపై పవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అప్పట్లో సనాతన ధర్మాన్ని విమర్శించినా.. ధర్మంపై దాడి చేసిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై పలువురు విమర్శలు చేయగా, మరికొందరు పవన్ను సమర్ధించారు.
అయితే.. ఆ వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మరింత మంది సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కల్యాణ్ తొందర పడ్డారని, ఇప్పుడు లడ్డూ కల్తీ అయినట్టుగా ఎలాంటి ఆధారాలూ చూపించలేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కామెంట్లు చేశారు. దీనిపై తాజాగా స్పందించిన నాగబాబు.. పవన్ కల్యాణ్ను విమర్శించే వారు.. సూడో సెక్యులర్ లు అని వ్యాఖ్యానించారు. “హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదు” అని పవన్ వ్యాఖ్యానించినట్టు చెప్పు కొచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పు ఎలా అవుతాయన్నారు. సూడో సెక్యులరిస్టులు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇక, మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారంపైనా నాగబాబు స్పందించారు. “డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట. అన్ని మతాలను అందరూ గౌరవించాలి” అని నాగబాబు వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణ కమిటీని కేవలం ఏపీలోనే కాదని.. జాతీయ స్థాయిలో చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా పేర్కొన్న పవన్ కల్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది మంగళవారంతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్తున్నారు. దీక్షను అక్కడే విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల పోటును పరిశీలించడంతోపాటు.. లడ్డూ తయారీని కూడా తెలుసుకుంటారు. వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా పరిశీలించి.. నాణ్యతపై అధికారులతో సమీక్షించనున్నారు. అదేవిధంగా తిరుమల అన్న ప్రసాదం, లడ్డూ సహా ఇతర ప్రసాదాల నాణ్యతపై తగు సూచనలు చేయనున్నారు.
This post was last modified on September 30, 2024 9:41 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…