Political News

పవన్‌ను విమర్శించేవారికి నాగ‌బాబు కౌంటర్

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు నాగ‌బాబు.. త‌న త‌మ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వెనుకేసుకు వ‌చ్చారు. హిందూ ధ‌ర్మంపై గ‌తంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లపై కొంద‌రు మిశ్ర‌మంగా స్పందించిన విష‌యం తెలిసిందే. తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయిన వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అప్ప‌ట్లో స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శించినా.. ధ‌ర్మంపై దాడి చేసిన ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేయ‌గా, మ‌రికొంద‌రు ప‌వ‌న్‌ను స‌మ‌ర్ధించారు.

అయితే.. ఆ వ్య‌వ‌హారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రింత మంది సోష‌ల్ మీడియాలో స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తొంద‌ర ప‌డ్డార‌ని, ఇప్పుడు ల‌డ్డూ క‌ల్తీ అయిన‌ట్టుగా ఎలాంటి ఆధారాలూ చూపించ‌లేద‌ని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. కామెంట్లు చేశారు. దీనిపై తాజాగా స్పందించిన నాగ‌బాబు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించే వారు.. సూడో సెక్యుల‌ర్ లు అని వ్యాఖ్యానించారు. “హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు చెప్పు కొచ్చారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పు ఎలా అవుతాయ‌న్నారు. సూడో సెక్యుల‌రిస్టులు చేసే వ్యాఖ్య‌ల‌ను తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇక‌, మాజీ సీఎం జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారంపైనా నాగ‌బాబు స్పందించారు. “డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట. అన్ని మతాలను అందరూ గౌరవించాలి” అని నాగబాబు వ్యాఖ్యానించారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీని కేవ‌లం ఏపీలోనే కాద‌ని.. జాతీయ స్థాయిలో చ‌ట్ట‌బ‌ద్ధంగా ఏర్పాటు చేయాల‌ని నాగ‌బాబు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారాన్ని హిందూ ధ‌ర్మంపై జ‌రిగిన దాడిగా పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 11 రోజుల ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇది మంగ‌ళ‌వారంతో ముగియ‌నుంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుమ‌ల‌కు వెళ్తున్నారు. దీక్ష‌ను అక్క‌డే విర‌మించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుమ‌ల పోటును ప‌రిశీలించ‌డంతోపాటు.. ల‌డ్డూ త‌యారీని కూడా తెలుసుకుంటారు. వెంగ‌మాంబ‌ అన్న ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్రాన్ని కూడా ప‌రిశీలించి.. నాణ్య‌త‌పై అధికారుల‌తో స‌మీక్షించ‌నున్నారు. అదేవిధంగా తిరుమ‌ల అన్న ప్ర‌సాదం, ల‌డ్డూ స‌హా ఇత‌ర ప్ర‌సాదాల నాణ్య‌త‌పై త‌గు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

This post was last modified on September 30, 2024 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

58 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago