Political News

దొంగ‌తో స్నేహం.. శ్రీధ‌ర్‌బాబు చెడిపోయారు: కేటీఆర్

మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “ఓటుకు నోటు దొంగ‌తో క‌లిసి కూర్చుని.. మంత్రి శ్రీధ‌ర్ బాబు చెడిపోయారు. లేక‌పోతే, ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి” అని వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్‌.. హైడ్రా స‌హా మూసీ న‌ది ప‌క్క‌న ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన బాదితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కూల్చివేత‌ల‌ బాధితుల‌ను చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని.. వారిని ఉద్దేశించి మంత్రి శ్రీధ‌ర్ బాబు చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని అన్నారు.

అయితే.. శ్రీధ‌ర్‌బాబు ఉన్న‌త విద్యావంతుద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి సంస్కారం ఉన్న వ్య‌క్తి అని, త‌న‌కు ఆయ‌నంటే ఎంతో గౌర‌వం కూడా ఉంద‌న్నారు. కానీ, సావాస దోషంతో శ్రీధ‌ర్‌బాబు చెడిపోయార‌ని చెప్పారు. ఓటు కు నోటు దొంగ ప‌క్క‌న కూర్చుని.. శ్రీధ‌ర్ చెడిపోయార‌న్నారు. అందుకే సంస్కారవంతుడైన మంత్రి శ్రీధర్ కూడా నోటికి ఏది వ‌స్తే అదే మాట్లాడుతున్నార ని విమ‌ర్శ‌లు గుప్పించారు. హైడ్రా కార‌ణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల ప‌ట్ల క‌నీసం సానుభూతి కూడా చూపించ‌డం లేద‌న్నారు. పైగా.. 5 వేల రూపాయ‌ల కోస‌మే బాధితులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌ని మంత్రి చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు.

తీవ్ర ఆరోప‌ణ‌లు..
ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పీసీసీ చీఫ్ ప‌ద‌విని 50 కోట్ల‌కు అమ్ముకున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీఎం ప‌ద‌విని కూడా 500 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముకున్నార‌ని అన్నారు. మంత్రులు అవినీతి ప‌రులుగా మారిపోయార‌ని, ప‌ర్సంటేజీలు పంచుకుంటున్నార‌ని, ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి అల‌వాట్లు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లేవ‌న్నారు. 5 వేల రూపాయ‌ల కోసం ఏడుస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను మంత్రి శ్రీధ‌ర్ బాబు వెన‌క్కి తీసుకోవాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. శ్రీధ‌ర్‌బాబు బ‌య‌ట తిర‌గ‌లేని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

కాగా, కేటీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గు మంటున్నారు. ఓటుకు నోటు దొంగ అంటూ.. ప‌రోక్షంగా ఈ కేసులో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే కేటీఆర్ వ్యాఖ్యానించార‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో త‌మ రియాక్ష‌న్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 30, 2024 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago