మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఓటుకు నోటు దొంగతో కలిసి కూర్చుని.. మంత్రి శ్రీధర్ బాబు చెడిపోయారు. లేకపోతే, ఆయన చాలా మంచి వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్.. హైడ్రా సహా మూసీ నది పక్కన ఆక్రమణలు తొలగించిన బాదితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కూల్చివేతల బాధితులను చులకనగా చూస్తున్నారని.. వారిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు.
అయితే.. శ్రీధర్బాబు ఉన్నత విద్యావంతుదని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అని, తనకు ఆయనంటే ఎంతో గౌరవం కూడా ఉందన్నారు. కానీ, సావాస దోషంతో శ్రీధర్బాబు చెడిపోయారని చెప్పారు. ఓటు కు నోటు దొంగ పక్కన కూర్చుని.. శ్రీధర్ చెడిపోయారన్నారు. అందుకే సంస్కారవంతుడైన మంత్రి శ్రీధర్ కూడా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నార ని విమర్శలు గుప్పించారు. హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల కనీసం సానుభూతి కూడా చూపించడం లేదన్నారు. పైగా.. 5 వేల రూపాయల కోసమే బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మంత్రి చెప్పడం దారుణమన్నారు.
తీవ్ర ఆరోపణలు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీఎం పదవిని కూడా 500 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. మంత్రులు అవినీతి పరులుగా మారిపోయారని, పర్సంటేజీలు పంచుకుంటున్నారని, ఒకరినొకరు కాపాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అలవాట్లు తెలంగాణ ప్రజలకు లేవన్నారు. 5 వేల రూపాయల కోసం ఏడుస్తున్నారన్న వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. శ్రీధర్బాబు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కాగా, కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నాయకులు భగ్గు మంటున్నారు. ఓటుకు నోటు దొంగ అంటూ.. పరోక్షంగా ఈ కేసులో ఉన్న సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించే కేటీఆర్ వ్యాఖ్యానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుందని హైదరాబాద్కు చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 30, 2024 9:36 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…