ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు జనసేన జెండా కప్పుకొన్నారు. ఇక, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో నాయకులు పార్టీలు మారుతున్నారు. వీరందరి చూపు.. టీడీపీ కంటే జనసేన వైపే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీడీపీలో నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా జనసేన వైపు చూస్తున్నారన్నది ఒక చర్చ. అయితే.. వైసీపీని చీల్చి తాము లబ్ది పొందాలని కాంగ్రెస్ భావించింది.
ఈ క్రమంలోనే వైఎస్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయినా కూడా ఎవరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదు. వెళ్తే.. టీడీపీ, లేకపోతే జనసేన అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అలాగని షర్మిల నాయకత్వాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేనలో చేరుతున్న నాయకులను పరిశీలిస్తే.. వీరికి సుదీర్ఘకాలం.. వైఎస్తో అనుబంధం ఉంది.
అలాంటి నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, షర్మిల వైపు కానీ మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక, జనసేన కాదని అంటే తప్ప.. ఆ నాయకులు కాంగ్రెస్లో చేరే పరిస్థితిలేదు. కానీ, జనసేనకు కేడర్ లేకపోవడం, బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో వద్దనే పరిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బలపడితే.. తమ ఓటు బ్యాంకు చీలిపోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. జనసేన ఎవరు వచ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండడంతో కాంగ్రెస్ డీలా పడుతోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…