Political News

జ‌న‌సేన ఎఫెక్ట్‌.. కాంగ్రెస్ డీలా!

ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. విశ్లేష‌కులు ఈ మాటే చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వ‌ల‌స రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఒక‌వైపు వ‌ర‌ద‌లు-ప‌రిహారం విష‌యాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మ‌రోవైపు ఓడిపోయిన నాయ‌కులు, వైసీపీ నేత‌లు.. త‌మ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్ర‌మంలో మెజారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండ‌లేక చాలా మంది జంప్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ఉద‌య‌భాను వంటి కీల‌క నాయ‌కులు జ‌న‌సేన జెండా క‌ప్పుకొన్నారు. ఇక‌, స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి కూడా వంద‌ల సంఖ్య‌లో నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. వీరంద‌రి చూపు.. టీడీపీ కంటే జ‌న‌సేన వైపే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. టీడీపీలో నేత‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇలా జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న‌ది ఒక చ‌ర్చ‌. అయితే.. వైసీపీని చీల్చి తాము ల‌బ్ది పొందాల‌ని కాంగ్రెస్ భావించింది.

ఈ క్ర‌మంలోనే వైఎస్ కుమార్తె ష‌ర్మిల‌కు పార్టీ ప‌గ్గాలు కూడా అప్ప‌గించింది. అయినా కూడా ఎవ‌రూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డం లేదు. వెళ్తే.. టీడీపీ, లేక‌పోతే జ‌న‌సేన అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగ‌ని ష‌ర్మిల నాయ‌క‌త్వాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌డం లేదు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జ‌న‌సేనలో చేరుతున్న నాయ‌కుల‌ను ప‌రిశీలిస్తే.. వీరికి సుదీర్ఘ‌కాలం.. వైఎస్‌తో అనుబంధం ఉంది.

అలాంటి నాయ‌కులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, ష‌ర్మిల వైపు కానీ మొగ్గు చూప‌డం లేదు. దీంతో ఇక‌, జ‌న‌సేన కాద‌ని అంటే త‌ప్ప‌.. ఆ నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరే ప‌రిస్థితిలేదు. కానీ, జ‌న‌సేన‌కు కేడ‌ర్ లేక‌పోవ‌డం, బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో వ‌ద్ద‌నే ప‌రిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే.. త‌మ ఓటు బ్యాంకు చీలిపోయే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. అందుకే.. జ‌న‌సేన ఎవ‌రు వ‌చ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండ‌డంతో కాంగ్రెస్ డీలా ప‌డుతోంది.

This post was last modified on September 30, 2024 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

12 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

1 hour ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

1 hour ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago