ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు జనసేన జెండా కప్పుకొన్నారు. ఇక, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో నాయకులు పార్టీలు మారుతున్నారు. వీరందరి చూపు.. టీడీపీ కంటే జనసేన వైపే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీడీపీలో నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా జనసేన వైపు చూస్తున్నారన్నది ఒక చర్చ. అయితే.. వైసీపీని చీల్చి తాము లబ్ది పొందాలని కాంగ్రెస్ భావించింది.
ఈ క్రమంలోనే వైఎస్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయినా కూడా ఎవరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదు. వెళ్తే.. టీడీపీ, లేకపోతే జనసేన అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అలాగని షర్మిల నాయకత్వాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేనలో చేరుతున్న నాయకులను పరిశీలిస్తే.. వీరికి సుదీర్ఘకాలం.. వైఎస్తో అనుబంధం ఉంది.
అలాంటి నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, షర్మిల వైపు కానీ మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక, జనసేన కాదని అంటే తప్ప.. ఆ నాయకులు కాంగ్రెస్లో చేరే పరిస్థితిలేదు. కానీ, జనసేనకు కేడర్ లేకపోవడం, బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో వద్దనే పరిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బలపడితే.. తమ ఓటు బ్యాంకు చీలిపోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. జనసేన ఎవరు వచ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండడంతో కాంగ్రెస్ డీలా పడుతోంది.
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…