ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు జనసేన జెండా కప్పుకొన్నారు. ఇక, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో నాయకులు పార్టీలు మారుతున్నారు. వీరందరి చూపు.. టీడీపీ కంటే జనసేన వైపే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీడీపీలో నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా జనసేన వైపు చూస్తున్నారన్నది ఒక చర్చ. అయితే.. వైసీపీని చీల్చి తాము లబ్ది పొందాలని కాంగ్రెస్ భావించింది.
ఈ క్రమంలోనే వైఎస్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయినా కూడా ఎవరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదు. వెళ్తే.. టీడీపీ, లేకపోతే జనసేన అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అలాగని షర్మిల నాయకత్వాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేనలో చేరుతున్న నాయకులను పరిశీలిస్తే.. వీరికి సుదీర్ఘకాలం.. వైఎస్తో అనుబంధం ఉంది.
అలాంటి నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, షర్మిల వైపు కానీ మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక, జనసేన కాదని అంటే తప్ప.. ఆ నాయకులు కాంగ్రెస్లో చేరే పరిస్థితిలేదు. కానీ, జనసేనకు కేడర్ లేకపోవడం, బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో వద్దనే పరిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బలపడితే.. తమ ఓటు బ్యాంకు చీలిపోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. జనసేన ఎవరు వచ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండడంతో కాంగ్రెస్ డీలా పడుతోంది.
This post was last modified on September 30, 2024 3:18 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…