రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం. మన అనుకున్నవారే.. ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాల్లో కామనే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు.. తర్వాత.. విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదరవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా.. ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షంపై దాడి ఉంటుంది. ఇది సహజం. అయితే.. అసలు ఒక్క సీటును కూడా దక్కించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. జగన్ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన నాయకులు ఒక లెక్క అయితే.. తానే వదిలి పెట్టిన బాణం.. ఎదురుతిరిగి.. తనపైనే శరపరంపరలను ప్రయోగిస్తున్న తీరు మరో లెక్కగా మారింది. షర్మిల చేస్తున్న విమర్శలు.. వేస్తున్న కౌంటర్లు.. వెలికి తీస్తున్న విషయాలు.. జగన్కు తీవ్ర తలనొప్పిగా మారాయి.
అంతేకాదు.. అసలు షర్మిలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు వచ్చి సమాధానం చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ బయటకు రాలేక పోతున్నారు. దీనికి కారణం.. నోరు లేని నాయకులు కాదు.. వైసీపీ నోరు విప్పలేని విధంగా షర్మిల వాయించేస్తుం డడమే దీనికి కారణం. ఒకటా రెండా.. అనేక విషయాల్లో షర్మిల సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కోలేక.. జగన్ శిబిరం చేతులు ఎత్తేసింది.
కొన్ని ఉదాహరణలు..
This post was last modified on September 30, 2024 3:17 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…