ప్రాయశ్చిత్త దీక్షతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని దశ దిశలకూ తీసుకువెళ్లే ప్రయ త్నం చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుమల శ్రీవారి ప్రసాదంలో అత్యంత దారుణమైన కల్తీ జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో దీనిపై కార్యాచరణను యుద్ధప్రాతిపదికన రూపొందించుకు న్న పవన్ ఆవెంటనే దీక్షకు దిగారు. అయితే.. ఈ దీక్షపై రెండు రూపాల్లో స్పందన వచ్చింది. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడారు.
ఇదేసమయంలో మరికొందరు దీక్షను తప్పుబట్టారు. ఇక, మెజారిటీ మేధావులు.. హిందూ వర్గాలు కూడా.. దీక్షను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో తాను కమ్యూనిస్టు భావాలు ఉన్న నాయకుడినని ఆయనే చెప్పుకొచ్చారు. తనకు చే-గువేరా వంటివారు ఆదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తి.. నేరుగా పోయి పోయి హిందూ సంప్రదాయాన్ని, కల్తీని భుజాన వేసుకుని.. దీక్షకు కూర్చోవడాన్ని మేధావులు పెద్దగా పట్టించుకోలేదు.
ఇక, కీలకమైన మాస్ ఓటింగ్ విషయానికి వస్తే.. పవన్కు ఎప్పుడూ ఉన్న ఇమేజే ఇప్పుడు కూడా ఉంది. దీనిలో పెద్దగా వచ్చిన మార్పు కనిపించలేదు. తొలుత మంగళగిరిలో దీక్షను చేపట్టిన పవన్..ఆ వెంటనే.. మరుసటి రోజు దుర్గమ్మ మెట్లు కడిగారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. దీక్షకు తగిన విధంగా ఫోకస్ లభించలేదని.. అందుకే ఆయన మెట్లు కడిగారని.. కొందరు వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విమర్శలు.. ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. దీక్ష తెచ్చిన గ్రాఫ్ ఎంత? అనేది కీలకం.
ఈ విషయంలో పవన్ ఆశించినంత అయితే గ్రాఫ్ పెరగలేదు. దీక్ష చేశారు అంతే! ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన కూటమి పార్టీలు .. పవన్ దీక్షకు దిగడంతో క్రెడిట్ అంతా ఆయనే సొంతం చేసుకుంటున్నారన్న భావనలో మునిగిపోయా యి. దీంతో ఆయా పార్టీలు కూడా.. ఎంత వరకు స్పందించాలో అంతవరకే స్పందించి వదిలేశాయి. ఒక నాయకుడిగా పవన్ కు ఉన్న ఇమేజ్.. దీక్ష ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన ఇమేజ్లో పెద్దగా తేడా అయితే కనిపించలేదన్నది విశ్లేషకుల మాట.
This post was last modified on September 26, 2024 12:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…