Political News

పోల్ దెబ్బకు.. రోజా గుడ్‌బై

గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ల మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మదిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు.

వైసీపీ హయాంలో విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఒకరు. హద్దులు దాటిన మాటలు, అవినీతి వ్యవహారాలతో ఆమె జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అధికారం పోయాక కొంత కాలం సైలెంటుగా ఉన్న రోజా.. ఇటీవల మళ్లీ పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టారు. తమ పార్టీని వెనకేసుకొచ్చారు.

ఐతే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తరచుగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఎప్పట్నంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంపై రోజా వైసీపీని వెనకేసుకొచ్చేసరికి జనాలకు ఇంకా మండిపోతోంది.

తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో పోల్స్ పెట్టగా.. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. జగన్‌ను ఛీకొట్టారు. ఈ పోల్ రిజల్ట్స్ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రోజా పనిగట్టుకుని జగన్ పరువు తీసినట్లయింది.

ఈ దెబ్బకు తన యూట్యూబ్ ఛానెల్‌నే రోజా మూసేయాల్సి వచ్చింది. ఈ ఛానల్లో రోజా తరచుగా వీడియోలు పోస్ట్ చేసేది. అది ఆమె అఫీషియల్ ఛానెల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె తాను యూట్యూబ్‌లో లేనని పేర్కొంటూ వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాత్రమే ఉన్నట్లు తాజాగా పోస్ట్ పెట్టడం గమనార్హం. మొత్తానికి రోజా అవసరం లేని పోల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెల్‌నే మూసుకోవాల్సి వచ్చిందన్నమాట.

This post was last modified on September 25, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

33 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago