గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ల మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మదిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు.
వైసీపీ హయాంలో విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఒకరు. హద్దులు దాటిన మాటలు, అవినీతి వ్యవహారాలతో ఆమె జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అధికారం పోయాక కొంత కాలం సైలెంటుగా ఉన్న రోజా.. ఇటీవల మళ్లీ పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టారు. తమ పార్టీని వెనకేసుకొచ్చారు.
ఐతే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తరచుగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఎప్పట్నంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంపై రోజా వైసీపీని వెనకేసుకొచ్చేసరికి జనాలకు ఇంకా మండిపోతోంది.
తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో పోల్స్ పెట్టగా.. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. జగన్ను ఛీకొట్టారు. ఈ పోల్ రిజల్ట్స్ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రోజా పనిగట్టుకుని జగన్ పరువు తీసినట్లయింది.
ఈ దెబ్బకు తన యూట్యూబ్ ఛానెల్నే రోజా మూసేయాల్సి వచ్చింది. ఈ ఛానల్లో రోజా తరచుగా వీడియోలు పోస్ట్ చేసేది. అది ఆమె అఫీషియల్ ఛానెల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె తాను యూట్యూబ్లో లేనని పేర్కొంటూ వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రమే ఉన్నట్లు తాజాగా పోస్ట్ పెట్టడం గమనార్హం. మొత్తానికి రోజా అవసరం లేని పోల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెల్నే మూసుకోవాల్సి వచ్చిందన్నమాట.
This post was last modified on September 25, 2024 3:03 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…