గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ల మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మదిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు.
వైసీపీ హయాంలో విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఒకరు. హద్దులు దాటిన మాటలు, అవినీతి వ్యవహారాలతో ఆమె జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అధికారం పోయాక కొంత కాలం సైలెంటుగా ఉన్న రోజా.. ఇటీవల మళ్లీ పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టారు. తమ పార్టీని వెనకేసుకొచ్చారు.
ఐతే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తరచుగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఎప్పట్నంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంపై రోజా వైసీపీని వెనకేసుకొచ్చేసరికి జనాలకు ఇంకా మండిపోతోంది.
తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో పోల్స్ పెట్టగా.. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. జగన్ను ఛీకొట్టారు. ఈ పోల్ రిజల్ట్స్ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రోజా పనిగట్టుకుని జగన్ పరువు తీసినట్లయింది.
ఈ దెబ్బకు తన యూట్యూబ్ ఛానెల్నే రోజా మూసేయాల్సి వచ్చింది. ఈ ఛానల్లో రోజా తరచుగా వీడియోలు పోస్ట్ చేసేది. అది ఆమె అఫీషియల్ ఛానెల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె తాను యూట్యూబ్లో లేనని పేర్కొంటూ వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రమే ఉన్నట్లు తాజాగా పోస్ట్ పెట్టడం గమనార్హం. మొత్తానికి రోజా అవసరం లేని పోల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెల్నే మూసుకోవాల్సి వచ్చిందన్నమాట.
This post was last modified on September 25, 2024 3:03 pm
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…