ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆశావహులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల టిక్కెట్ దక్కించుకోలేక పోయిన నేతలకు, టిక్కెట్లు త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
This post was last modified on September 24, 2024 6:30 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…