ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆశావహులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల టిక్కెట్ దక్కించుకోలేక పోయిన నేతలకు, టిక్కెట్లు త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
This post was last modified on September 24, 2024 6:30 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…