ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆశావహులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల టిక్కెట్ దక్కించుకోలేక పోయిన నేతలకు, టిక్కెట్లు త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
This post was last modified on September 24, 2024 6:30 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…