కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపబోతున్నామని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ భేటీలో ఇదుకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ న్యాయవాదులకు ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఇకపై, జూనియర్ లాయర్లకు ప్రతి నెలా 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుబెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. దాంతోపాటు జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా 100 ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.
మరోవైపు, మైనార్టీ సంక్షేమ శాఖపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయించారు. ఇక, మసీదులలో ఇమామ్ లకు 10 వేల రూపాయలు, మౌజన్ లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి చేకూరేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
This post was last modified on September 23, 2024 7:06 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…