Political News

బీజేపీ+జ‌న‌సేన‌-వైసీపీ!!

తిరుమ‌ల ల‌డ్డూ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన ద‌రిమిలా ఏపీలో రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపు తిరిగాయి. ఈ విష‌యాన్ని మ‌రింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా ప్రాయ‌శ్చిత్త దీక్ష‌కు కూర్చున్నారు. మ‌రోవైపు.. బీజేపీ నాయ‌కులు కూడా దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇంటిపై దాడికి కూడా య‌త్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీల‌కంగా మారింది.

అంతేకాదు.. ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న స‌ఖ్య‌త నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. తిరుప‌తి ల‌డ్డూ వ్య‌వ‌హారాన్ని మ‌రింత సీరియ‌స్‌గా తీసుకుని.. దీక్ష‌కు కూర్చోవ‌డంతో జాతీయ‌స్థాయిలో ఈ విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజానికి ఇలాంటి విష‌యాలు వెలుగు చూసిన‌ప్పుడు బీజేపీ నాయ‌కులు స్పందించి నిర‌స‌న‌ల‌కు దిగ‌డం.. కామ‌న్‌. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ వ్య‌వ‌హారాన్నిభుజాన వేసుకున్నారు.

హిందూ విశ్వాసాల‌పై జ‌రిగిన దాడిగా ఆయ‌న పేర్కొంటూ.. దీక్ష‌కు కూర్చున్నారు. ఈ ప‌రిణామం.. వైసీపీని నానా తిప్ప‌లు పెడుతోంది. క్షేత్ర‌స్థాయిలో వాడ‌వాడ‌లా ఇప్పుడు ప‌వ‌న్ దీక్ష వ్య‌వ‌హారం చ‌ర్చ‌గా మారింది. ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్క‌డ చ‌ర్చ వ‌చ్చినా.. ప‌వ‌న్ దీక్ష గురించే కీల‌కంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇది చిన్న విష‌యం కాదు. హిందువుల‌ను గుండుగుత్త‌గా జ‌న‌సేన వైపు న‌డిపించే కీల‌క అంశం.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి హిందూ సామాజిక వ‌ర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని ప‌టాపంచ‌లు చేసేలా ప‌వ‌న్ దీక్ష ప్ర‌భావం చూప‌నుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌, బీజేపీ చేస్తున్న నిర‌స‌న‌లు కూడా అంతే ప్ర‌భావం చూపుతున్నాయి. నాయ‌కులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చ‌ర్చ కూడా సాగుతోంది. మొత్తంగా.. బీజేపీ+జ‌న‌సేన చేస్తున్న దూకుడు రాజ‌కీయం.. వైసీపీని పూర్తిస్థాయిలో నేల‌మ‌ట్టం చేయ‌డంఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 23, 2024 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago