తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది.
అంతేకాదు.. ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న సఖ్యత నేపథ్యంలో జనసేన అధినేత పవన్.. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకుని.. దీక్షకు కూర్చోవడంతో జాతీయస్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు వెలుగు చూసినప్పుడు బీజేపీ నాయకులు స్పందించి నిరసనలకు దిగడం.. కామన్. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్నిభుజాన వేసుకున్నారు.
హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొంటూ.. దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామం.. వైసీపీని నానా తిప్పలు పెడుతోంది. క్షేత్రస్థాయిలో వాడవాడలా ఇప్పుడు పవన్ దీక్ష వ్యవహారం చర్చగా మారింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చర్చ వచ్చినా.. పవన్ దీక్ష గురించే కీలకంగా చర్చించుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. హిందువులను గుండుగుత్తగా జనసేన వైపు నడిపించే కీలక అంశం.
అంతేకాదు.. ఇప్పటి వరకు వైసీపీకి హిందూ సామాజిక వర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని పటాపంచలు చేసేలా పవన్ దీక్ష ప్రభావం చూపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, బీజేపీ చేస్తున్న నిరసనలు కూడా అంతే ప్రభావం చూపుతున్నాయి. నాయకులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా.. బీజేపీ+జనసేన చేస్తున్న దూకుడు రాజకీయం.. వైసీపీని పూర్తిస్థాయిలో నేలమట్టం చేయడంఖాయమని అంటున్నారు పరిశీలకులు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…