తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది.
అంతేకాదు.. ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న సఖ్యత నేపథ్యంలో జనసేన అధినేత పవన్.. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకుని.. దీక్షకు కూర్చోవడంతో జాతీయస్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు వెలుగు చూసినప్పుడు బీజేపీ నాయకులు స్పందించి నిరసనలకు దిగడం.. కామన్. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్నిభుజాన వేసుకున్నారు.
హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొంటూ.. దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామం.. వైసీపీని నానా తిప్పలు పెడుతోంది. క్షేత్రస్థాయిలో వాడవాడలా ఇప్పుడు పవన్ దీక్ష వ్యవహారం చర్చగా మారింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చర్చ వచ్చినా.. పవన్ దీక్ష గురించే కీలకంగా చర్చించుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. హిందువులను గుండుగుత్తగా జనసేన వైపు నడిపించే కీలక అంశం.
అంతేకాదు.. ఇప్పటి వరకు వైసీపీకి హిందూ సామాజిక వర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని పటాపంచలు చేసేలా పవన్ దీక్ష ప్రభావం చూపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, బీజేపీ చేస్తున్న నిరసనలు కూడా అంతే ప్రభావం చూపుతున్నాయి. నాయకులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా.. బీజేపీ+జనసేన చేస్తున్న దూకుడు రాజకీయం.. వైసీపీని పూర్తిస్థాయిలో నేలమట్టం చేయడంఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 23, 2024 9:51 am
ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం…
అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి,…
టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో…
దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్…
ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది.…
స్టార్ హీరోల ఈవెంట్లలో అభిమానులు ఎంత హడావుడి చేస్తారో టాలీవుడ్ సినిమా ఈవెంట్లు చూసే వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని…