Political News

బీజేపీ+జ‌న‌సేన‌-వైసీపీ!!

తిరుమ‌ల ల‌డ్డూ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన ద‌రిమిలా ఏపీలో రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపు తిరిగాయి. ఈ విష‌యాన్ని మ‌రింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా ప్రాయ‌శ్చిత్త దీక్ష‌కు కూర్చున్నారు. మ‌రోవైపు.. బీజేపీ నాయ‌కులు కూడా దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇంటిపై దాడికి కూడా య‌త్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీల‌కంగా మారింది.

అంతేకాదు.. ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న స‌ఖ్య‌త నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. తిరుప‌తి ల‌డ్డూ వ్య‌వ‌హారాన్ని మ‌రింత సీరియ‌స్‌గా తీసుకుని.. దీక్ష‌కు కూర్చోవ‌డంతో జాతీయ‌స్థాయిలో ఈ విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజానికి ఇలాంటి విష‌యాలు వెలుగు చూసిన‌ప్పుడు బీజేపీ నాయ‌కులు స్పందించి నిర‌స‌న‌ల‌కు దిగ‌డం.. కామ‌న్‌. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ వ్య‌వ‌హారాన్నిభుజాన వేసుకున్నారు.

హిందూ విశ్వాసాల‌పై జ‌రిగిన దాడిగా ఆయ‌న పేర్కొంటూ.. దీక్ష‌కు కూర్చున్నారు. ఈ ప‌రిణామం.. వైసీపీని నానా తిప్ప‌లు పెడుతోంది. క్షేత్ర‌స్థాయిలో వాడ‌వాడ‌లా ఇప్పుడు ప‌వ‌న్ దీక్ష వ్య‌వ‌హారం చ‌ర్చ‌గా మారింది. ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్క‌డ చ‌ర్చ వ‌చ్చినా.. ప‌వ‌న్ దీక్ష గురించే కీల‌కంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇది చిన్న విష‌యం కాదు. హిందువుల‌ను గుండుగుత్త‌గా జ‌న‌సేన వైపు న‌డిపించే కీల‌క అంశం.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి హిందూ సామాజిక వ‌ర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని ప‌టాపంచ‌లు చేసేలా ప‌వ‌న్ దీక్ష ప్ర‌భావం చూప‌నుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌, బీజేపీ చేస్తున్న నిర‌స‌న‌లు కూడా అంతే ప్ర‌భావం చూపుతున్నాయి. నాయ‌కులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చ‌ర్చ కూడా సాగుతోంది. మొత్తంగా.. బీజేపీ+జ‌న‌సేన చేస్తున్న దూకుడు రాజ‌కీయం.. వైసీపీని పూర్తిస్థాయిలో నేల‌మ‌ట్టం చేయ‌డంఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

19 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

24 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

35 minutes ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

2 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…

4 hours ago