రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం సంచలనంగా మారింది.
సీఎం చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబ సభ్యురాలి గురించి మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద రాజుకున్న వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చే క్రమంలో.. అనూహ్యంగా వైఎస్ భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగాఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
“నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. ఆయన్ను తలచుకొనే ఏ పనైనా చేస్తాను. చిన్నప్పుడు శనివారం ఒక పొద్దు ఉండేవాళ్లం. నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది. అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను. మనం నిమిత్తమాత్రులం. .ఆ ఏడుకొండలవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించి పోరాడా” అంటూ తాను శ్రీవారికి ఎంతటి వీర భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
This post was last modified on September 22, 2024 10:19 am
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…