రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం సంచలనంగా మారింది.
సీఎం చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబ సభ్యురాలి గురించి మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద రాజుకున్న వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చే క్రమంలో.. అనూహ్యంగా వైఎస్ భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగాఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
“నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. ఆయన్ను తలచుకొనే ఏ పనైనా చేస్తాను. చిన్నప్పుడు శనివారం ఒక పొద్దు ఉండేవాళ్లం. నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది. అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను. మనం నిమిత్తమాత్రులం. .ఆ ఏడుకొండలవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించి పోరాడా” అంటూ తాను శ్రీవారికి ఎంతటి వీర భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
This post was last modified on September 22, 2024 10:19 am
టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఒకప్పుడు నారా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ మధ్యలో ఆయనతో విభేదాలు…
రొటీన్ జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలు అందులోనూ సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఉండేవి ఎంచుకుంటాడని పేరున్న అడవి శేష్ నుంచి…
ఇండియన్ బాక్సాఫీస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాకు ఇంకో ఆరు రోజులే సమయం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు.…
ఐదేళ్ల పాటు అంతులేని అధికారం అనుభవించాక.. ప్రతిపక్షంలో కొనసాగడం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టంగానే అనిపిస్తున్నట్లుంది.ప్రతిపక్షంలో…
‘ఉప్పెన’ సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన రెండో…