రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం సంచలనంగా మారింది.
సీఎం చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబ సభ్యురాలి గురించి మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద రాజుకున్న వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చే క్రమంలో.. అనూహ్యంగా వైఎస్ భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగాఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
“నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. ఆయన్ను తలచుకొనే ఏ పనైనా చేస్తాను. చిన్నప్పుడు శనివారం ఒక పొద్దు ఉండేవాళ్లం. నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది. అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను. మనం నిమిత్తమాత్రులం. .ఆ ఏడుకొండలవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించి పోరాడా” అంటూ తాను శ్రీవారికి ఎంతటి వీర భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
This post was last modified on September 22, 2024 10:19 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…