రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం సంచలనంగా మారింది.
సీఎం చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబ సభ్యురాలి గురించి మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద రాజుకున్న వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చే క్రమంలో.. అనూహ్యంగా వైఎస్ భారతి మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగాఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
“నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. ఆయన్ను తలచుకొనే ఏ పనైనా చేస్తాను. చిన్నప్పుడు శనివారం ఒక పొద్దు ఉండేవాళ్లం. నా చిన్నప్పుడు మా ఇంటి నుంచి తిరుమల కనిపించేది. అలాంటి ఆలయం విషయంలో నేను తప్పు మాట్లాడను. మనం నిమిత్తమాత్రులం. .ఆ ఏడుకొండలవాడే నాతో వాస్తవాలు చెప్పించారని అనుకుంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు.. దాన్ని వ్యతిరేకించి పోరాడా” అంటూ తాను శ్రీవారికి ఎంతటి వీర భక్తుడ్ని అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
This post was last modified on September 22, 2024 10:19 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…