సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తమని ఆ మహిళా స్వయంగా హైకోర్టులో హాజరై అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది. ఆదిమూలంపై పెట్టింది తప్పుడు కేసు అని, దానిని కొట్టివేయాలని జడ్జికి ఆ మహిళ చెప్పడం సంచలనం రేపింది. మూడో వ్యక్తి ఒత్తిడితోనే ఆదిమూలంపై బాధిత మహిళ అటువంటి ఆరోపణలు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఇక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశామని బాధిత మహిళా తరపు న్యాయవాది వాదించారు వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేయాలని కోరారు. ఇక, పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆదిమూలం గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ మహిళ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, తనను ఎమ్మెల్యే బెదిరించి రేప్ చేశారని ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం, కేసు కొట్టేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ కేసు కొట్టివేస్తే ఎమ్మెల్యే ఆదిమూలం తో పాటు టీడీపీకి ఊరట లభించినట్లవుతుంది.
This post was last modified on September 21, 2024 1:19 pm
ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…
ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. 'పుష్ప 2' సినిమాతో ఏకంగా…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రస్థాయి రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ…
ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు.…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన సంగతి…