Political News

ఆదిమూలం రేప్ కేసులో బిగ్ ట్విస్ట్

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తమని ఆ మహిళా స్వయంగా హైకోర్టులో హాజరై అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది. ఆదిమూలంపై పెట్టింది తప్పుడు కేసు అని, దానిని కొట్టివేయాలని జడ్జికి ఆ మహిళ చెప్పడం సంచలనం రేపింది. మూడో వ్యక్తి ఒత్తిడితోనే ఆదిమూలంపై బాధిత మహిళ అటువంటి ఆరోపణలు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఇక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశామని బాధిత మహిళా తరపు న్యాయవాది వాదించారు వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేయాలని కోరారు. ఇక, పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆదిమూలం గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆ మహిళ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, తనను ఎమ్మెల్యే బెదిరించి రేప్ చేశారని ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం, కేసు కొట్టేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ కేసు కొట్టివేస్తే ఎమ్మెల్యే ఆదిమూలం తో పాటు టీడీపీకి ఊరట లభించినట్లవుతుంది.

This post was last modified on September 21, 2024 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ రేట్లకు పాజిటివ్ టాక్ తోడైతే

ఊహించినదాని కన్నా ఎక్కువగా ఏపీలో దేవరకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేశారు. ఆ మేరకు అధికారిక జిఓ విడుదల…

26 mins ago

లడ్డూ వివాదంతో రాజస్థాన్ సీఎం అలర్ట్

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యి కలిపారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది…

2 hours ago

28 రోజులకే ఓటిటి శనివారం

దసరా తర్వాత వంద కోట్ల గ్రాస్ సాధించిన నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.…

4 hours ago

రాజా సాబ్ హీరోయిన్ ‘యుధ్రా’ ఎలా ఉంది

విజయ్ మాస్టర్, రజినీకాంత్ పేటతో మనకు పరిచయమైన మాళవిక మోహనన్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది కానీ…

5 hours ago

అర్ధరాత్రి షోల మీద వీడని సస్పెన్స్

సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద ఎన్నేసి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేసినట్టుగా…

5 hours ago

కూతుర్ని చంపేసి పూడ్చేసిన పేరెంట్స్

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఒక అరాచక ఉదంతాన్ని నోటితో కూడా చెప్పలేనిది. ఎంత ఇష్టం లేని…

5 hours ago