సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తమని ఆ మహిళా స్వయంగా హైకోర్టులో హాజరై అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది. ఆదిమూలంపై పెట్టింది తప్పుడు కేసు అని, దానిని కొట్టివేయాలని జడ్జికి ఆ మహిళ చెప్పడం సంచలనం రేపింది. మూడో వ్యక్తి ఒత్తిడితోనే ఆదిమూలంపై బాధిత మహిళ అటువంటి ఆరోపణలు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఇక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశామని బాధిత మహిళా తరపు న్యాయవాది వాదించారు వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేయాలని కోరారు. ఇక, పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆదిమూలం గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ మహిళ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, తనను ఎమ్మెల్యే బెదిరించి రేప్ చేశారని ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం, కేసు కొట్టేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ కేసు కొట్టివేస్తే ఎమ్మెల్యే ఆదిమూలం తో పాటు టీడీపీకి ఊరట లభించినట్లవుతుంది.
This post was last modified on September 21, 2024 1:19 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…