ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి బొనాంజా ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పింఛన్లను రూ.1000 చొప్పున పెంచి అమలు చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ అందిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం. దీనిని కూడా చంద్రబాబు సర్కారు అమలు చేయడం ప్రారంభించింది. ఈ పరంపరలో ఇప్పుడు మహిళా పథకాలకు కూడా శ్రీకారం చుట్టింది.
ఎన్నికల సమయంలో మహిళల సెంట్రిక్గా చంద్రబాబు 4 కీలక పథకాలను ప్రకటించారు. ఇవి సూపర్ సిక్స్లో భాగంగా ఉన్నాయి. 1) మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 2) ఆడబిడ్డ నిధి: దీని కింద 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం. 3) మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం. 4) తల్లికి వందనం: ఈ పథకంలో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఉన్న తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం. ఈ 4 కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీలు.
ఈ క్రమంలో తాజాగా ఒక పథకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే.. 3వ పథకమైన వంట గ్యాస్ సిలిండర్లు. ఏటా మూడు సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్నట్టు తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే దీపావళి (అక్టోబరు)పండుగ నుంచి ఈ పథకాన్నిఅమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేబినెట్లోనూ చర్చించామని చెప్పారు. ఈ పథకం కింద తొలి సిలిండర్ను దీపావళి రోజు మహిళల ఇంటికి అందేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఈ పథకంలో గ్యాస్ సలిండర్ ఉచితంగా అందుతుందన్నారు. తదుపరి సిలిండర్ సంక్రాంతి రోజున, మూడో సిలిండర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా.. మరోరోజున అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిందర్ ధర రూ.830 ఉంది. దీనిని పూర్తి ఉచితంగా అందించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఇతర పథకాలను విడతల వారీగా అమలు చేయనున్నట్టు తెలిపారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకల కారణంగా ఖజానా ఖాళీ అయిపోయిందని. అయినా.. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వెనుకాడబోమని అన్నారు. సంపద సృష్టించి.. దానిని పేదలకు పంచుతామని చెప్పారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…