బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ కన్నా ఇలా ఏదో ఒక వార్తతో ఎక్కువ సందడి చేస్తుంది. హిందీ సీరియల్స్ నుంచి సినిమాలకు ప్రమోట్ అయిన అమ్మడు చిన్నగా అక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో ఉండగా హను రాఘవపూడి దృష్టిలో పడింది.
అలా సీతారామం అవకాశం దక్కించుకున్న మృణాల్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సీతారామం లో మృణాల్ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఆమెను తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేశాయి.
ఆ తరువాత హాయ్ నాన్న కూడా ఆమె నటనతో ఆకట్టుకుంది. ఐతే 3వ ప్రయత్నంగా చేసిన ది ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మాత్రం డిజప్పాయింట్ చేసింది. 3 సినిమాలతోనే తెలుగులో సూపర్ పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ తర్వాత ఛాన్స్ లు అందుకోవడంలో వెనకబడింది. కల్కి 2898 AD సినిమాలో చిన్న క్యామియో చేసినా అది కెరీర్ కి ఉపయోగపడలేదు.
ఫైనల్ గా అడివి శేష్ డెకాయిట్ లో మృణాల్ ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో అడివి శేష్, మృణాల్ జోడీ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఐతే మృణాల్ గురించి సినిమాల పరంగా పక్కన పెడితే ఆమె ఎవరితో కాస్త క్లోజ్ గా కనిపించినా సరే విపరీతమైన రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
ఆమధ్య సుమంత్ తో కలిసి దిగిన ఫోటోతో సోషల్ మీడియా అంతా హడావిడి చేయగా అది సీతారామం టైం లో దిగిన ఫోటో అని తెలిసి సైలెంట్ అయ్యారు. ఇక ఈమధ్య కోలీవుడ్ స్టార్ ధనుష్ తో మృణాల్ ని కలిపి వస్తున్న వార్తలు తెలిసిందే.
ధనుష్ తో తనకి కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ అని మృణాల్ చెప్పినా కూడా ఈ వార్తలను ఆపట్లేదు. ఇక మరోపక్క మృణాల్ సిద్ధార్థ్ చతుర్వేదితో క్లోజ్ గా ఉండటంతో మళ్లీ టాపిక్ అతని మీదకు డైవర్ట్ అయ్యింది.
మొత్తానికి మృణాల్ ఠాకూర్ ఎవరితో క్లోజ్ ఉన్నా ఏదో జరుగుతుంది.. సంథింగ్ సంథింగ్ అనడం కామన్ అయ్యింది. సినిమాల కన్నా మృణాల్ కి ఈ విషయాలు ఆమెను ప్రేక్షకులకు టచ్ లో ఉండేలా చేస్తున్నా కూడా ఇలాంటి వార్తల వల్ల ఆమెకు ఇబ్బందే కానీ అంత ప్రొత్సాహకరంగా ఉండవని చెప్పడంలో సందేహం లేదు.
This post was last modified on February 5, 2026 7:01 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…