రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సమయంలో ఈ వ్యవహా రం వివాదంగా మారింది. దీంతో వారిని ఎన్నికలకు ముందు పక్కన పెట్టారు. అదేవిధంగా జగన్ హయాంలోనే ప్రతి 2 వేల ఇళ్ల పరిధిలో ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ప్రభుత్వంలోని మునిసిపల్ నుంచి రెవెన్యూ వరకు పోలీసు నుంచి ఇరిగేషన్ వరకు అన్ని శాఖలకు సంబంధించి సెక్రటరీలు, అడ్మిన్లను ఏర్పాటు చేశారు.
అయితే.. వీటి వల్ల ప్రత్యేకంగా వచ్చిన లబ్ధి, ప్రజలకు అందిన ప్రత్యేక సేవలు లేవని భావిస్తున్న కూటమి ప్రభుత్వం సచివాలయాలను ఆయా ప్రభుత్వాల శాఖలకు అటాచ్ చేయనున్నారు. అదేవిధంగా కొన్నింటిని కలిపివేయనున్నారు. ఈ మేరకు తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరంతా పక్కన ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో 2.3 లక్షల మంది వాలంటీర్లకు గాను.. 1.7 లక్షల మంది వైసీపీ నేతల ఒత్తిడితో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
మిగిలిన వారిలోనూ చాలా మంది వేరే ఉపాధి చూసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వలంటీర్లను ప్రభుత్వ శాఖలకు అటాచ్ చేస్తారు. వారి నైపుణ్యం.. సహా ఇతర విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో వారికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. అయితే.. రాజీనామా చేసిన వారిని మాత్రం తీసుకునేది లేదని మంత్రి వర్గ సమావేశంలో పలువురు మంత్రులు తేల్చి చెప్పడం గమనార్హం. ఇక, వలంటీర్ల విద్యార్హతను కూడా పెంచే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఓకేచేసింది. ఈ విషయాలపై చర్చించి.. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది.
This post was last modified on September 18, 2024 10:40 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…