Political News

20 ఏళ్ల రాధా ప్ర‌స్థానం.. !

వంగ‌వీటి రాధా. విజ‌య‌వాడ స‌హా.. ఉభ‌య గోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల్లో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్నిఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. త‌న‌కు అనుకూలంగానే కాదు.. స‌మాజానికి కూడా అనుకూలంగా మార్చిన వంగ‌వీటి రంగా వార‌సుడి గా.. రాజ‌కీయ అరంగేట్రం చేసి.. 20 ఏళ్లు పూర్త‌య్యాయి. 2004లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి రాజ‌కీయంగా అడుగులు వేసిన రాధా.. రంగా వారసుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయ‌న తండ్రి పేరును నిల‌బెడ‌తారంటూ.. ఆ నాడు.. ఎంతో మంది పోటీలో ఉన్నా.. అంద‌రినీ కాద‌ని.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. కోరి కోరి రాధాకు టికెట్ ఇచ్చారు.

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన రాధా.. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతే! ఆ తర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు విజ‌యం అన్న మాట వినిపించ‌డ‌మే మానేసింది. ఈ 20 ఏళ్ల‌లో రాధా సాధించింది ఏమైనా ఉందా? అంటే.. లేద‌నే చెప్పాలి. నిజానికి రంగా రాజ‌కీయ జీవితం చూసుకుంటే.. 19-20 సంవ‌త్స‌రాల లోపే ఉంటుంది. 1947లో జ‌న్మించిన రంగా.. 1988లో మృతి చెందారు. అంటే.. ఆయ‌న జీవించిందే 41 ఏళ్లు. ఈ రకంగా చూసుకుంటే.. రంగా రాజ‌కీయ జీవితం స్వ‌ల్పం.

అయితే.. ఎంత‌కాలం ఉన్నామ‌న్న‌ది కాదు.. ఎంత మెరుగ్గా ఉన్న‌మ‌న్న‌దే లెక్క అని అన్న‌ట్టు ఉన్న‌ది స్వ‌ల్ప కాలమే అయినా.. ఆయ‌న పేరు ఇప్ప‌టికీ చిర‌స్థాయి. మ‌రో 100 సంవ‌త్స‌రాల వ‌ర‌కు రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ.. ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధాకు రాజ‌కీయంగా 20 ఏళ్లు పూర్త‌య్యాయి. మ‌రి ఎంత మెరుగ్గా ఉండి ఉండాలి? ఎన్ని ప‌ద‌వులు చేసి ఉండాలి? కానీ, అలాంటిది ఏమీ క‌నిపించ‌డం లేదు. ఒకే ఒక్క‌సారి ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నార‌న్న రికార్డు మినహా.. రాధాకు మిగిలింది ఏమీ లేకుండా పోయింది.

సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోలేక పోవ‌డం.. త‌న తండ్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా అడుగులు వేయ‌క‌పోవ‌డం.. బ‌లమైన ఉద్య‌మ నిర్మాత‌గా త‌న‌ను తాను మ‌లుచుకోలేక పోవ‌డం.. ఒక‌ప్పుడు రంగాకు వెన్నుద‌న్నుగా ఉన్న కార్మిక సంఘాల‌కు రాధా దూరంగా కావ‌డం.. వంటివి రాధాను మాస్ నాయ‌కుడిగా నిల‌బెట్ట‌లేక పోయాయి. రాధా అంటే.. క్లాస్ నాయ‌కుడిగానే చూసే ప‌రిస్థితిని ఆయ‌నే తెచ్చుకున్నారు. దీనికితోడు రాజ‌కీయంగా వేసిన అడుగులు కూడా మైన‌స్ అయ్యాయి. పెరిగిపోయిన జంపింగులు.. ఆయ‌న‌ను మ‌రింత జావ‌గార్చాయి. ఫ‌లితంగా.. రాధా ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగానే ఉంది. మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న రూటు మార్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on September 16, 2024 6:57 am

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

31 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago