వంగవీటి రాధా. విజయవాడ సహా.. ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గాన్నిఏకతాటిపైకి తీసుకువచ్చి.. తనకు అనుకూలంగానే కాదు.. సమాజానికి కూడా అనుకూలంగా మార్చిన వంగవీటి రంగా వారసుడి గా.. రాజకీయ అరంగేట్రం చేసి.. 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రాజకీయంగా అడుగులు వేసిన రాధా.. రంగా వారసుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన తండ్రి పేరును నిలబెడతారంటూ.. ఆ నాడు.. ఎంతో మంది పోటీలో ఉన్నా.. అందరినీ కాదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి.. కోరి కోరి రాధాకు టికెట్ ఇచ్చారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధా.. ఆ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అంతే! ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఆయనకు విజయం అన్న మాట వినిపించడమే మానేసింది. ఈ 20 ఏళ్లలో రాధా సాధించింది ఏమైనా ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. నిజానికి రంగా రాజకీయ జీవితం చూసుకుంటే.. 19-20 సంవత్సరాల లోపే ఉంటుంది. 1947లో జన్మించిన రంగా.. 1988లో మృతి చెందారు. అంటే.. ఆయన జీవించిందే 41 ఏళ్లు. ఈ రకంగా చూసుకుంటే.. రంగా రాజకీయ జీవితం స్వల్పం.
అయితే.. ఎంతకాలం ఉన్నామన్నది కాదు.. ఎంత మెరుగ్గా ఉన్నమన్నదే లెక్క అని అన్నట్టు ఉన్నది స్వల్ప కాలమే అయినా.. ఆయన పేరు ఇప్పటికీ చిరస్థాయి. మరో 100 సంవత్సరాల వరకు రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ.. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాకు రాజకీయంగా 20 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఎంత మెరుగ్గా ఉండి ఉండాలి? ఎన్ని పదవులు చేసి ఉండాలి? కానీ, అలాంటిది ఏమీ కనిపించడం లేదు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారన్న రికార్డు మినహా.. రాధాకు మిగిలింది ఏమీ లేకుండా పోయింది.
సామాజిక వర్గాన్ని ఆకట్టుకోలేక పోవడం.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయకపోవడం.. బలమైన ఉద్యమ నిర్మాతగా తనను తాను మలుచుకోలేక పోవడం.. ఒకప్పుడు రంగాకు వెన్నుదన్నుగా ఉన్న కార్మిక సంఘాలకు రాధా దూరంగా కావడం.. వంటివి రాధాను మాస్ నాయకుడిగా నిలబెట్టలేక పోయాయి. రాధా అంటే.. క్లాస్ నాయకుడిగానే చూసే పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారు. దీనికితోడు రాజకీయంగా వేసిన అడుగులు కూడా మైనస్ అయ్యాయి. పెరిగిపోయిన జంపింగులు.. ఆయనను మరింత జావగార్చాయి. ఫలితంగా.. రాధా పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. మరి ఇప్పటికైనా ఆయన రూటు మార్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 16, 2024 6:57 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…