వైసీపీ అధినేత జగన్.. వారానికి ఒక సారి బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. వీకెండ్ అక్కడే గడిపేసి వచ్చి.. రెండు రోజులు చంద్రబాబుపై ఏవో నాలుగు మాటలు అనేసి వెళ్లిపోతున్నారు. మళ్లీ వీకెండ్ బెంగళూరు టూరే. ఇదీ.. గత మూడు మాసాల నుంచి జరుగుతున్న పని. అయితే.. ఆయన చెబుతున్నది ఏంటంటే.. పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండాలని! నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని!!
ఈ విషయంపైనే అధికారికంగా.. నేతలందరికీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన.. గెలిచిన నాయకులకు కూడా జగన్ నుంచి సందేశాలు అందాయి. “తక్షణం ప్రజల మధ్యకు వెళ్లండి. మీకు నచ్చిన రీతిలో ప్రజల సమస్యలను ప్రస్తావించండి. ప్రజలకు అండగా ఉండండి” అని జగన్ ఇచ్చిన సందేశంలో కీలక అంశం. అయితే.. దీనిని ఎంత మంది పాటిస్తున్నారు? అంటే.. జీరో! ఎందుకంటే.. పార్టీ అధినేతే.. సవ్యంగా ప్రజల మధ్య ఉండనప్పుడు.. ఆ మాటకొస్తే.. నాయకులకే ఆయన అందుబాటులో ఉండడం లేదు.
దీంతో నాయకులు కూడా ఎవరికి వారు ఎవరికి తోచిన విధంగా వారు ఉంటున్నారు. చాలా మంది నాయకులు.. తమ తమ వ్యాపారాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. “ఎన్నికల్లో మా నాయకుడు చాలానే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు నష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చే ఆలోచన అయితే.. లేదు” అని సీమకు చెందిన ఇంకా చెప్పాలంటే.. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఓ మైనారిటీ నాయకుడి అనుచరుడు చెప్పాడు.
ఈ ఒక్కరే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఇక, జగన్ వీర భక్త నాయకులుగా గుర్తింపు పొందిన రోజా, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్, పాముల పుష్ప శ్రీవాణి, కారుమూరి నాగేశ్వరరావు వంటివారు కూడా.. బయటకు రావడం లేదు. మరికొందరు గడుసుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. “ఆయన కు పాస్ పోర్టు వచ్చి ఉంటే ఇప్పుడు లండన్లో ఉండేవారు. ఆయన లేకుండా మేం ఏం చేస్తాం.” అని విజయవాడకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు వ్యాఖ్యానించారు. సో.. జగనే ప్రజలను పట్టించుకోకుండా.. బెంగళూరు-తాడేపల్లి చుట్టూ తిరుగుతుంటే.. నాయకులు మాత్రం ప్రజల్లో తిరుగుతారా? అనేది ఇక్కడ కీలక పాయింట్.
This post was last modified on September 16, 2024 6:45 am
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…