Political News

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా చేరిపోయారు. రాజ‌కీయ నేత‌ల‌తోనూ.. ప‌లువురు ఇటీవ‌ల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగ‌డం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ఎక్సైజ్ శాఖ‌కు చెందిన ఓ అధికారి ఆయ‌న‌తో ఫొటో దిగారు. అంతే.. ఆ మ‌ర్నాడే ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ.. ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. అది కూడా గుంటూరు జైల్లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా కానిస్టేబుల్ ఆయేషా బాను చిక్కుల్లో ప‌డ్డారు. ఇటీవ‌ల జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగారు.

వీరిలో కానిస్టేబుల్ ఆయేషా బాను కూడా ఉన్నారు. ఆమె త‌న బిడ్డ‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఇది సామాజిక మాధ్య‌మా ల్లో జోరుగా వైర‌ల్ అయింది. ప్ర‌ధాన మీడియా కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌లు రాసింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి ఉండి.. ఇలా చేయ‌డం ఏంట‌ని నిల‌దీసింది. ఇక‌, తాజాగా పోలీసులు ఆమెపై చ‌ర్య‌ల‌కు దిగారు. ప్ర‌స్తుతం ఇలా ఎందుకు సెల్పీ దిగాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ.. ఆమెకు మెమో జారీ చేశారు. దీనికి ఆమె ఇచ్చే వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు గుంటూరు జిల్లా జైల‌ర్‌(ఎస్పీ స్థాయి) తెలిపారు.

వివ‌ర‌ణ సంతృప్తిగా లేక‌పోతే.. కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయేషా బాను వ్య‌వ‌హారం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. తొంద‌ర‌పడి ఎవ‌రితోనూ సెల్ఫీలు దిగ‌రాద‌ని.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. సీనియ‌ర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇక నుంచైనా.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

This post was last modified on September 13, 2024 10:25 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

5 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

6 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

6 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

7 hours ago