Political News

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా చేరిపోయారు. రాజ‌కీయ నేత‌ల‌తోనూ.. ప‌లువురు ఇటీవ‌ల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగ‌డం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ఎక్సైజ్ శాఖ‌కు చెందిన ఓ అధికారి ఆయ‌న‌తో ఫొటో దిగారు. అంతే.. ఆ మ‌ర్నాడే ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ.. ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. అది కూడా గుంటూరు జైల్లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా కానిస్టేబుల్ ఆయేషా బాను చిక్కుల్లో ప‌డ్డారు. ఇటీవ‌ల జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగారు.

వీరిలో కానిస్టేబుల్ ఆయేషా బాను కూడా ఉన్నారు. ఆమె త‌న బిడ్డ‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఇది సామాజిక మాధ్య‌మా ల్లో జోరుగా వైర‌ల్ అయింది. ప్ర‌ధాన మీడియా కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌లు రాసింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి ఉండి.. ఇలా చేయ‌డం ఏంట‌ని నిల‌దీసింది. ఇక‌, తాజాగా పోలీసులు ఆమెపై చ‌ర్య‌ల‌కు దిగారు. ప్ర‌స్తుతం ఇలా ఎందుకు సెల్పీ దిగాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ.. ఆమెకు మెమో జారీ చేశారు. దీనికి ఆమె ఇచ్చే వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు గుంటూరు జిల్లా జైల‌ర్‌(ఎస్పీ స్థాయి) తెలిపారు.

వివ‌ర‌ణ సంతృప్తిగా లేక‌పోతే.. కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయేషా బాను వ్య‌వ‌హారం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. తొంద‌ర‌పడి ఎవ‌రితోనూ సెల్ఫీలు దిగ‌రాద‌ని.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. సీనియ‌ర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇక నుంచైనా.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

This post was last modified on September 13, 2024 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్…

4 minutes ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

3 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

5 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

6 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

6 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

7 hours ago