Political News

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా చేరిపోయారు. రాజ‌కీయ నేత‌ల‌తోనూ.. ప‌లువురు ఇటీవ‌ల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగ‌డం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ఎక్సైజ్ శాఖ‌కు చెందిన ఓ అధికారి ఆయ‌న‌తో ఫొటో దిగారు. అంతే.. ఆ మ‌ర్నాడే ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ.. ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. అది కూడా గుంటూరు జైల్లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా కానిస్టేబుల్ ఆయేషా బాను చిక్కుల్లో ప‌డ్డారు. ఇటీవ‌ల జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగారు.

వీరిలో కానిస్టేబుల్ ఆయేషా బాను కూడా ఉన్నారు. ఆమె త‌న బిడ్డ‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఇది సామాజిక మాధ్య‌మా ల్లో జోరుగా వైర‌ల్ అయింది. ప్ర‌ధాన మీడియా కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌లు రాసింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి ఉండి.. ఇలా చేయ‌డం ఏంట‌ని నిల‌దీసింది. ఇక‌, తాజాగా పోలీసులు ఆమెపై చ‌ర్య‌ల‌కు దిగారు. ప్ర‌స్తుతం ఇలా ఎందుకు సెల్పీ దిగాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ.. ఆమెకు మెమో జారీ చేశారు. దీనికి ఆమె ఇచ్చే వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు గుంటూరు జిల్లా జైల‌ర్‌(ఎస్పీ స్థాయి) తెలిపారు.

వివ‌ర‌ణ సంతృప్తిగా లేక‌పోతే.. కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయేషా బాను వ్య‌వ‌హారం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. తొంద‌ర‌పడి ఎవ‌రితోనూ సెల్ఫీలు దిగ‌రాద‌ని.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. సీనియ‌ర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇక నుంచైనా.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

9 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

35 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

36 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago