ఒకప్పుడు సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ముచ్చటపడేవారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ జాబితా లో రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. రాజకీయ నేతలతోనూ.. పలువురు ఇటీవల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగడం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందులకు గురవుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రస్తుత మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారు.
ఈ సమయంలో ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ అధికారి ఆయనతో ఫొటో దిగారు. అంతే.. ఆ మర్నాడే ఆయనను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అది కూడా గుంటూరు జైల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను చిక్కుల్లో పడ్డారు. ఇటీవల జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు.
వీరిలో కానిస్టేబుల్ ఆయేషా బాను కూడా ఉన్నారు. ఆమె తన బిడ్డతో కలిసి సెల్ఫీ దిగారు. ఇది సామాజిక మాధ్యమా ల్లో జోరుగా వైరల్ అయింది. ప్రధాన మీడియా కూడా విమర్శలు గుప్పిస్తూ వార్తలు రాసింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. ఇలా చేయడం ఏంటని నిలదీసింది. ఇక, తాజాగా పోలీసులు ఆమెపై చర్యలకు దిగారు. ప్రస్తుతం ఇలా ఎందుకు సెల్పీ దిగాల్సి వచ్చిందో చెప్పాలంటూ.. ఆమెకు మెమో జారీ చేశారు. దీనికి ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు గుంటూరు జిల్లా జైలర్(ఎస్పీ స్థాయి) తెలిపారు.
వివరణ సంతృప్తిగా లేకపోతే.. కానిస్టేబుల్ను సస్పెండ్ చేయనున్నట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయేషా బాను వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. తొందరపడి ఎవరితోనూ సెల్ఫీలు దిగరాదని.. ఇబ్బందులు వస్తాయని.. సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇక నుంచైనా.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on September 13, 2024 10:25 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…