Political News

ఆ ‘కోటి’ క‌దిలేదెప్పుడు?

బుడమేరు ముంపుకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహా యం చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బెజవాడ ముంపు కుటుంబాలకు రాష్ట్రాల సరిహద్దులు దాటి మానవీయ కోణంలో సినిమా స్టార్ట్ లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ఆధ్యాత్మిక సంఘాలు, సేవా సంస్థలు, ఎన్ ఆర్ ఐ లు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి స్వయంగా విరాళాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే.

వ‌ర‌ద ప్ర‌భావిత దృశ్యాలను టీవీల్లో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌దిలిపోయారు. మేమున్నాంటూ.. చిన్నా పెద్దా అంద‌రూ సాయం చేశారు. వీరిలో పాఠ‌శాల విద్యార్థులు కూడా ఉన్నారు. త‌మ‌కు ఇచ్చిన పాకెట్ మ‌నీని కూడా చిన్నారులు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌కు విరాళంగా అందించారు. మ‌రి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేశార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. జగన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికార పార్టీ నాయ‌కులు దెప్పిపొడుస్తున్నారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో తొలిరోజు ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు. అయితే.. ఈ సొమ్ముల‌ను ఇంకా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం.. వాటిని ఎవ‌రికీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ఒక‌వేళ ఇచ్చి ఉంటే.. ఆ లెక్క‌లైనా చెప్పాలి. లేదా.. అనుకూల మీడియాలో అయినా ప్ర‌చురించి ఉండాలి. కానీ, అలా కూడా చేయ‌లేద‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. “కోటి రూపాయలు ప్రకటించి, వాటిని ఎలా ఇవ్వాలో పార్టీలో చర్చించి ఇస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. తాను రూపాయి ఇవ్వకపోగా, కనీసం ప్రతి పక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విపత్తుకు సంబందించి ఆదుకోవాలని అడగనూ లేదు, లేఖ కూడా రాయనూ లేదు” అని టీడీపీనేత‌లు ఆరోపించారు.

ఇలాంటి వైఖరితో ఉన్న జ‌గ‌న్‌.. ముంపు బాధితులను పరామర్శించినా, పరామర్శించక పోయినా ఒక్కటే అని నాయ‌కులు అభిప్రాయపడుతున్నారు. 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు వచ్చినా ‘ఏంరా బాలరాజు’ అన్నట్లు మారకపోతే ఎలా? ప్రశ్నించారు. రాజ్య సభ లో 11 మంది, లోక్ సభ లో 4 ఉండి లాభమేంటి? అని ఎద్దేవా చేస్తున్నారు. ఆ కోటి సంగ‌తేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం స‌మాధానం చెబుతారోచూడాలి.

This post was last modified on September 13, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ బీజేపీలో ‘సొంత’ నిర్ణయాల చర్చ?

రాష్ట్ర బీజేపీలో నాయ‌కుల నియామ‌కం.. కొత్త‌గా వ‌చ్చే వారికి అవ‌కాశం ఇవ్వ‌డం... ఉన్న వారికి ప‌నులు కేటాయించ‌డం.. అనేది స‌హ‌జం.…

5 hours ago

మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు

ప్ర‌స్తుతం నెల‌కొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా…

7 hours ago

స్వీటీ పెళ్లి వార్త.. ఈసారైనా నిజమవుతుందా?

ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…

9 hours ago

అల్లు శిరీష్ అంత మాట అనేశాడేంటి?

టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…

9 hours ago

‘నెలసరి’ సెలవులపై సుప్రీం చెప్పింది కరెక్టేనా?

కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…

11 hours ago

స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్

పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…

12 hours ago