Political News

పెండ్యాల శ్రీనివాస్ ‘చెర’ త‌ప్పింది

పెండ్యాల శ్రీనివాస్‌. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సీనియ‌ర్ తెలుగు అధికారి. ఈయన 2014-19 మ‌ధ్య కాలంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. క‌ట్ చేస్తే.. 2019లో వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌నపై ప‌లు కేసులు పెట్టారు. ముఖ్యంగా చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డానికి కార‌ణ‌మ‌ని వైసీపీ పేర్కొన్న ‘స్కిల్’ డెవ‌ప‌ల్‌మెంట్ వ్య‌వ‌హారంలోనే పెండ్యాల‌పై వైసీపీ స‌ర్కారు కేసులు పెట్టింది.

ఈ క్ర‌మంలోనే సీఐడీ పెండ్యాల‌కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే.. ఈ విష‌యం తెలిసి ఆయ‌న అమెరికా వెళ్లిపోయారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంటు కేసులో.. సంబంధిత విభాగం నుంచి అక్ర‌మంగా నిధులు దారిమ‌ళ్లించార‌న్న‌ది వైసీపీ పెట్టిన కేసు. అయితే.. ఈ కేసులోనే చంద్ర‌బాబును జైల్లోనే పెట్టారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ కేసు పెట్ట‌డానికి.. చంద్ర‌బాబును జైల్లో పెట్ట‌డానికి సోమ‌వారంతో 100 రోజులు పూర్త‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ పెట్టిన కేసుల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు. పెండ్యాల శ్రీనివాస్‌పై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు విదించిన స‌స్పెన్ష‌న్‌ను కూడా ఎత్తి వేసింది. వెంట‌నే అమెరికా నుంచి ఏపీకి రావాల‌ని.. జీఏడీలో రిపోర్టు చేయాల‌ని కూడా స‌ర్కారు పేర్కొంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌ణాళిక శాఖ‌లో అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా పెండ్యాల వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పీఎస్‌గా కూడా ప‌నిచేశారు.

వైసీపీ హ‌యాంలో దాదాపు నాలుగేళ్ల‌పైగానే ఆయ‌న అమెరికాలో ఉండిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో స‌ర్కారు మార‌డంతో ఆయ‌న‌పై న‌మోదైన చార్జ్‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. దీంతో పెండ్యాల‌కు చెర వీడిన‌ట్టేన‌ని ఉద్యోగ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఆయ‌న ఎప్పుడు తిరిగి వ‌స్తారో చూడాలి.

This post was last modified on September 10, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

44 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago