Political News

‘జైలు’ ప‌రామ‌ర్శ‌ల‌కే జ‌గ‌న్ స‌రి!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు.. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు పెద్ద‌గా స‌మ‌యం లేకుండా పోయింది. కానీ, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మాత్రం ఆయ‌న అప్పాయింట్‌మెంట్లు రెడీ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ఎనిమిది రోజుల త‌ర్వాత కూడా వ‌ర‌ద ఇంకా వెంటాడుతోంది. ఇక్క‌డి వారిని ప్ర‌భుత్వం ఎలానూ ఆదుకుంటోంది.

అయితే…. ప్ర‌తిప‌క్ష నేత‌గా, మాజీ సీఎంగా జ‌గ‌న్‌కు కూడా కొంత మేర‌కు బాధ్య‌త ఉంటుంది క‌దా?! ఈ విష‌యంలో ఆయ‌న పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. త‌న ప‌రివారాన్ని పంపించ‌డంలోనూ జ‌గ‌న్ పూర్తిగా మైన‌స్ అయిపోయార‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఆయ‌న ప‌రిధిలోనే ఉంది. వైసీపీ నాయ‌కులే న‌గ‌ర కార్పొరేష‌న్‌లో అధికారం చ‌లాయిస్తున్నారు. అయినా.. కూడా ఇక్క‌డ బాధితుల‌ను ప‌ట్టించుకునే తీరిక‌.. ఓపిక‌.. కూడా వైసీపీ నాయ‌కుల‌కు లేకుండా పోయింది.

ఇదిలావుంటే.. ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నెల్లూరు జై ల్లో ఉన్న మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి చుట్టూ తిరిగారు. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఓదార్చారు. ఇంత‌లోనే జ‌గ‌న్‌కు అత్యంత ప్రియ నేత‌, మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా.. చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను కూడా గుంటూరు జైల్లో పెట్టారు. గ‌త రెండు రోజులుగా సురేష్ జైల్లోనే ఉన్నారు..

దీంతో ఈయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందు కు జ‌గ‌న్ వెళ్తున్న‌ట్టు వైసీపీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ఇదేదో వ‌ర‌ద బాధితుల‌కు సేవ చేసేందుకు వెళ్తున్నార‌న్న రేంజ్లో ఉండ‌డంతో అంద‌రూ న‌వ్వుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ బాధిత నేత‌ల‌ను ఓదార్చుతున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుంటూరు జైల్లో నందిగంను ప‌రామ‌ర్శించ‌నున్నార‌ని ప్ర‌క‌ట‌నలో పేర్కొన‌డంగ‌మ‌నార్హం. మొత్తానికి వ‌ర‌ద బాధితుల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జైలు బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు.

Satya

Recent Posts

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

7 minutes ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

8 minutes ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

2 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

3 hours ago

ఫోటో కోసం శ్రీలీలను పక్కకు జరిపిన సీఎం భార్య?

ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…

3 hours ago

ఈ తప్పులకూ అంత పెద్ద శిక్షా…?

తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…

3 hours ago