ఏపీ సీఎం చంద్రబాబు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అత్యంత విపత్తులో ఉన్న విజయవాడ శివారు ప్రాంతాన్ని ఆదుకుంటామని ఆయన చెప్పిన మాట తూ.చ. తప్పకుండా అమలవుతోంది. ఎన్నడూ ఊహించని రీతిలో ప్రస్తుతం విజయవాడ శివారు ప్రాంతానికి వరద వచ్చింది. మనిషి లోతు నీళ్లు కాలనీలకు కాలనీలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. గత వారం రోజులుగా ఇబ్బంది పెట్టిన వరద ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.
దీంతో సమస్తం కోల్పోయిన ప్రజలు ఇళ్ల బాటపడుతున్నారు. అయితే.. అన్ని ప్రాంతాల్లోనూ ఇంట్లోని అత్యంత విలువైన వస్తువులు పాడైపోయాయి. ముఖ్యంగా ప్రతి ఇంటికీ ఇటీవల కాలంలో బైక్ కామన్ అయిపోయింది. అయితే వరదలతో బైకులు కూడా నీటమునిగి రోజుల తరబడి నానడంతో ఇంజన్లు పాడైపోయాయి. టైర్లు కూడా కొన్ని వందల బైకులకు పాడైపోయాయి. ఈ విషయాన్ని బాధితులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
బైకులు… ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర గృహోపకరణాలు కూడా నీట మునిగిపాడైపోయాయి. దీంతో చంద్రబాబు వారికి బలమైన హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి అయినా.. మెకానిక్లను తీసుకువచ్చి.. బళ్లు బాగుచేయించి ఇచ్చే బాద్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పారు. అన్నట్టుగానే .. ఈ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే చంద్రబాబు వేర్వేరు ప్రాంతాల నుంచి మెకానిక్లను విజయవాడకు తీసుకువచ్చారు. వీరంతా కూడా.. ఆర్టీసీ… పోలీసు, అగ్నిమాపక, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే స్కిల్డ్ టెక్నీషియన్స్.
వీరితోపాటు.. పలు ప్రముఖ కంపెనీలు టీవీఎస్, హీరో హోండా, సుజుకి తదితర కంపెనీలతోనూ మాట్లాడి .. ఆయా కంపెనీల్లోని మెకానిక్లను తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోయుద్ద ప్రాతిపదికన బైకులు రిపేర్ చేసే పనిని చేపట్టారు. రేయింబవళ్లు ఈ పనులు సాగుతాయని.. పోలీసులు కాపలాగా ఉంటారని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. దీంతో బైకర్లు.. ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. టీవీలు, ఫ్రిడ్జ్లు బాగు చేయడమా..? లేక.. ఇన్సూరెన్స్ ఇప్పించడమా? అనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది.
This post was last modified on September 10, 2024 9:40 am
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…