టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఈవో అవతారం ఎత్తారు. తానుపనిచేస్తూ.. తన వారితో పనిచేయిస్తూ.. ప్రజలను ఆదుకుంటున్నారు. సాధారణంగా యజమాని అయితే.. చెప్పి చేయించుకుంటారు. కానీ, సీఈవో మాత్రం తాను చేస్తూనే.. తన వారితో చేయిస్తారు. ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు యజమాని పొజిషన్లోనే ఉన్నా.. ఆయన ఆ విషయాన్ని ఆదివారమే మరిచిపోయారు. వయసుతో సంబంధం లేకుండా.. అనారోగ్య సమస్యలతోనూ సంబంధం లేకుండా తానే రంగంలోకి దిగిపోయారు.
నడుములోతు నీటిలోనూ చంద్రబాబు తిరుగుతున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన సెక్యూరిటీని కూడా ఆయన మరిచిపోతున్నారు. రైలు పట్టాలు ఎక్కేస్తున్నారు. కాలువల్లో తిరిగేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది బాధితులను ఆదుకోవడం ఒక్కటే. ఇంతకు మించి ఆయన తన హోదా.. వయసు, ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన తిరగడమే కాదు.. తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించుతున్నారు.
వారితోనూ అలుపెరుగకుండా పనులు చేయిస్తున్నారు. రాత్రిళ్లు వంటలు చేయించడం.. ఉదయాన్నే సూర్యోదయం నాటికే వాటిని పొట్లాలు కట్టి బాధితులకు అందిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి సాయం చేస్తున్నవారిని కలుస్తున్నారు. ఇంకా చేయాలనిప్రోత్సహిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చేవారిని సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడి కష్టాలు వివరిస్తున్నారు. బాధితులను సాధ్యమైనంత ఎక్కువగా ఆదుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకోవైపు.. పార్టీలో ఏర్పడుతున్న ఇబ్బందులను అప్పటికప్పుడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా రు. ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఇలా.. చంద్రబాబు రెండు చేతులతో ఒక మెదడుతో కాదు.. పదహారు చేతులతో పనిచేసతూ.. పది మెదళ్లతో ఆలోచిస్తూ.. బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఐదు రోజులు అయినా.. బాధిత ప్రాంతాల్లో ఇంకా మెరుగు పడిన పరిస్థితి కనిపించకపోవడంపై మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. చంద్రబాబు సీఈవోగా మారిపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2024 2:04 pm
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…