Political News

సీఈవో బాబు: తాను చేస్తూ.. త‌న వారితో చేయిస్తూ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి సీఈవో అవ‌తారం ఎత్తారు. తానుప‌నిచేస్తూ.. త‌న వారితో ప‌నిచేయిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నారు. సాధార‌ణంగా య‌జ‌మాని అయితే.. చెప్పి చేయించుకుంటారు. కానీ, సీఈవో మాత్రం తాను చేస్తూనే.. త‌న వారితో చేయిస్తారు. ఇప్పుడు వాస్త‌వానికి చంద్ర‌బాబు య‌జ‌మాని పొజిష‌న్‌లోనే ఉన్నా.. ఆయ‌న ఆ విష‌యాన్ని ఆదివార‌మే మ‌రిచిపోయారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోనూ సంబంధం లేకుండా తానే రంగంలోకి దిగిపోయారు.

న‌డుములోతు నీటిలోనూ చంద్ర‌బాబు తిరుగుతున్నారు. బాధితులను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న సెక్యూరిటీని కూడా ఆయ‌న మ‌రిచిపోతున్నారు. రైలు ప‌ట్టాలు ఎక్కేస్తున్నారు. కాలువ‌ల్లో తిరిగేస్తున్నారు. చంద్ర‌బాబుకు ఇప్పుడు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న‌ది బాధితుల‌ను ఆదుకోవ‌డం ఒక్క‌టే. ఇంత‌కు మించి ఆయ‌న త‌న హోదా.. వ‌య‌సు, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న తిర‌గ‌డ‌మే కాదు.. త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌ను కూడా రంగంలోకి దించుతున్నారు.

వారితోనూ అలుపెరుగ‌కుండా ప‌నులు చేయిస్తున్నారు. రాత్రిళ్లు వంట‌లు చేయించ‌డం.. ఉద‌యాన్నే సూర్యోద‌యం నాటికే వాటిని పొట్లాలు క‌ట్టి బాధితుల‌కు అందిస్తున్నారు. ఎక్క‌డెక్కడ నుంచో వ‌చ్చి సాయం చేస్తున్న‌వారిని క‌లుస్తున్నారు. ఇంకా చేయాల‌నిప్రోత్స‌హిస్తున్నారు. కేంద్రం నుంచి వ‌చ్చేవారిని స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. ఇక్క‌డి క‌ష్టాలు వివ‌రిస్తున్నారు. బాధితుల‌ను సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ఆదుకునేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇంకోవైపు.. పార్టీలో ఏర్ప‌డుతున్న ఇబ్బందుల‌ను అప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతున్నారు. ఇలా.. చంద్ర‌బాబు రెండు చేతుల‌తో ఒక మెద‌డుతో కాదు.. ప‌ద‌హారు చేతుల‌తో ప‌నిచేస‌తూ.. ప‌ది మెద‌ళ్ల‌తో ఆలోచిస్తూ.. బాధిత ప్రాంతాల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఐదు రోజులు అయినా.. బాధిత ప్రాంతాల్లో ఇంకా మెరుగు ప‌డిన ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంపై మరోవైపు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా.. చంద్ర‌బాబు సీఈవోగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 6, 2024 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

4 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago