టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఈవో అవతారం ఎత్తారు. తానుపనిచేస్తూ.. తన వారితో పనిచేయిస్తూ.. ప్రజలను ఆదుకుంటున్నారు. సాధారణంగా యజమాని అయితే.. చెప్పి చేయించుకుంటారు. కానీ, సీఈవో మాత్రం తాను చేస్తూనే.. తన వారితో చేయిస్తారు. ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు యజమాని పొజిషన్లోనే ఉన్నా.. ఆయన ఆ విషయాన్ని ఆదివారమే మరిచిపోయారు. వయసుతో సంబంధం లేకుండా.. అనారోగ్య సమస్యలతోనూ సంబంధం లేకుండా తానే రంగంలోకి దిగిపోయారు.
నడుములోతు నీటిలోనూ చంద్రబాబు తిరుగుతున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన సెక్యూరిటీని కూడా ఆయన మరిచిపోతున్నారు. రైలు పట్టాలు ఎక్కేస్తున్నారు. కాలువల్లో తిరిగేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది బాధితులను ఆదుకోవడం ఒక్కటే. ఇంతకు మించి ఆయన తన హోదా.. వయసు, ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన తిరగడమే కాదు.. తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించుతున్నారు.
వారితోనూ అలుపెరుగకుండా పనులు చేయిస్తున్నారు. రాత్రిళ్లు వంటలు చేయించడం.. ఉదయాన్నే సూర్యోదయం నాటికే వాటిని పొట్లాలు కట్టి బాధితులకు అందిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి సాయం చేస్తున్నవారిని కలుస్తున్నారు. ఇంకా చేయాలనిప్రోత్సహిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చేవారిని సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడి కష్టాలు వివరిస్తున్నారు. బాధితులను సాధ్యమైనంత ఎక్కువగా ఆదుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకోవైపు.. పార్టీలో ఏర్పడుతున్న ఇబ్బందులను అప్పటికప్పుడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా రు. ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఇలా.. చంద్రబాబు రెండు చేతులతో ఒక మెదడుతో కాదు.. పదహారు చేతులతో పనిచేసతూ.. పది మెదళ్లతో ఆలోచిస్తూ.. బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఐదు రోజులు అయినా.. బాధిత ప్రాంతాల్లో ఇంకా మెరుగు పడిన పరిస్థితి కనిపించకపోవడంపై మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. చంద్రబాబు సీఈవోగా మారిపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2024 2:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…