Political News

బొత్స‌కు బాధితుల సెగ‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. వ‌ర‌ద బాధితుల నుంచి భారీ సెగ త‌గిలింది. వ‌ర‌ద‌ల‌తో ముంచెత్తిన విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌లు ఆదివారం నుంచి ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం శాయ శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. స‌మ‌న్వ‌య లోపం కావొచ్చు.. అధికారుల తీరు కావొచ్చు.. మొత్తానికి బాధితుల‌కు సాయం అంద‌డం లేదు. అందినా.. కొంత మందికే అందుతోంది. దీంతో బాధితులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా పేద‌ల పార్టీగా చెప్పుకొనే వైసీపీ నాయ‌కులు త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని కూడా.. వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలోనే.. మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతం రాజ‌రాజేశ్వ‌రి పేట‌లో బుధ‌వారం రాత్రి ప‌ర్య‌టించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఇక్క‌డే ప‌ర్య‌టించి వెళ్లారు. అనంత‌రం.. బొత్స స‌త్య‌నారాయణ మ‌రికొన్ని వార్డుల‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని.. బాధితుల‌ను చూసి త‌న గుండె త‌రుక్కుపోతోంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఇంకా ఏదో చెప్ప‌బోతుంటే.. బాధిత మ‌హిళ‌లు ఆయ‌న‌ను త‌గులు కున్నారు. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేదు… మ‌రి మీరేం చేశారు? అని నిల‌దీశారు.

అంతేకాదు.. వ‌ర‌ద‌లు వ‌చ్చి.. తాము నానా ఇబ్బందులు ప‌డుతుంటే.. క‌నీసం ప‌ల‌క‌రించేందుకు కూడా వైసీపీ నాయ‌కుల‌కు మ‌న‌సు రాలేదా? అని కొంద‌రు మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు.. వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడు ఎక్క‌డికి వెళ్లారు? ఇప్పుడు వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌డుతుంటే.. వ‌చ్చారా? అని వ్యాఖ్యానించారు. ఇలా.. బొత్సను చుట్టుముట్టిన ప్ర‌జ‌లు.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న నోట మాట రాలేదు. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. దీంతో బొత్స అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. త‌మ‌కు అధికారం లేద‌ని.. తాము ఏమీ చేయ‌లేమ‌ని చెబుతూ.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.

This post was last modified on September 5, 2024 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

31 minutes ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

2 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

7 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

7 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

8 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

8 hours ago