వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు.. వరద బాధితుల నుంచి భారీ సెగ తగిలింది. వరదలతో ముంచెత్తిన విజయవాడలో ప్రజలు ఆదివారం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం శాయ శక్తులా ప్రయత్నిస్తోంది. అయితే.. సమన్వయ లోపం కావొచ్చు.. అధికారుల తీరు కావొచ్చు.. మొత్తానికి బాధితులకు సాయం అందడం లేదు. అందినా.. కొంత మందికే అందుతోంది. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా పేదల పార్టీగా చెప్పుకొనే వైసీపీ నాయకులు తమను అసలు పట్టించుకోకపోవడాన్ని కూడా.. వారు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలోనే.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతం రాజరాజేశ్వరి పేటలో బుధవారం రాత్రి పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఇక్కడే పర్యటించి వెళ్లారు. అనంతరం.. బొత్స సత్యనారాయణ మరికొన్ని వార్డులకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదని.. బాధితులను చూసి తన గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే.. బాధిత మహిళలు ఆయనను తగులు కున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేదు… మరి మీరేం చేశారు? అని నిలదీశారు.
అంతేకాదు.. వరదలు వచ్చి.. తాము నానా ఇబ్బందులు పడుతుంటే.. కనీసం పలకరించేందుకు కూడా వైసీపీ నాయకులకు మనసు రాలేదా? అని కొందరు మహిళలు ప్రశ్నించారు. మరికొందరు.. వరద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుంటే.. వచ్చారా? అని వ్యాఖ్యానించారు. ఇలా.. బొత్సను చుట్టుముట్టిన ప్రజలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన నోట మాట రాలేదు. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. దీంతో బొత్స అసహనం వ్యక్తం చేస్తూ.. తమకు అధికారం లేదని.. తాము ఏమీ చేయలేమని చెబుతూ.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.
This post was last modified on September 5, 2024 11:39 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…