ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. షెడ్యూల్ ప్రకారం గురువారం లండన్కు వెళ్లాల్సి ఉంది. ఆయన ఇద్దరు కుమార్తెలు.. బ్రిటన్లో చదువుతున్న విషయం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు ఈ నెలలోనే ఉంది. దీంతో ఆయన కుమార్తెలను చూసేందుకు బ్రిటన్కు వెళ్లాల్సి ఉందని.. నెల రోజుల కిందటే హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకు న్నారు. మొదట అనుమతి ఇవ్వద్దొని సీబీఐ తరఫున న్యాయ వాదులు కోర్టును కోరినా.. గతంలో బెయిల్ నిబంధనలు ఉన్నా.. ఆయన బ్రిటన్ సహా స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లి వచ్చారని పేర్కొన్న కోర్టు.. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
దీంతో తాజా పర్యటనకు 20 రోజుల కిందటే కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని, ఒక దేశానికి అని చెప్పి.. వేరేదేశం వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ఇదేసమయంలో ఫోన్ నెంబర్లు, పాస్ పోర్టు వివరాలను కూడా పోలీసులకు చెప్పాలని.. బ్రిటన్లో ఎక్కడ ఉంటున్నదీ ఎక్కడెక్కడ పర్యటించేది కూడా వెల్లడించాలని పేర్కొంది. మొత్తానికి జగన్కు, ఆయన సతీమణికి కూడా విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బ్రిటన్కు వెళ్లాలి. అయితే.. ఇంతలోనే ఏపీలో పరిస్థితి మారిపోయిం ది. కృష్ణానదికి పోటెత్తిన వరదలు, బుడమేరు పొంగడంతో పలు జిల్లాలు నీటి లో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు వరద నీటిలో జలదిగ్బంధమయ్యారు. గత నాలుగు రోజులుగా వారికి ఆహారం కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో వారిని వదిలేసి.. జగన్ బాధ్యత లేకుండా విదేశాలకు వెళ్లిపోతారా? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే.. మరోవైపు గోదావరికి కూడా.. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రమాదకర రీతిలో గోదావరి ప్రవహిస్తోంది.
దీంతో ఏ క్షణమైనా తూర్పు గోదావరికి కూడా.. ప్రమాదం పొంచి ఉందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు.. ప్రభుత్వ పక్షాలకు దీటుగా ప్రతిపక్షంగా జగన్ కూడా స్పందించాల్సి ఉంది. కానీ, ఆయన పరిస్థితి చూస్తే.. గత నాలుగు రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే విజయవాడలో పర్యటించారు. ఒకసారి కృష్ణ లంక, రెండోసారి బుధవారం రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. ఇంతకు మించి ఎలాంటి సాయం చేయలేదు. కానీ, ప్రజలు మాత్రం ప్రతిపక్షం కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో జగన్ విదేశాలకు వెళ్తే.. ఆయనకు మరింత బ్యాడ్నేమ్ వస్తుందని పార్టీ వర్గాలే చెబుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చేయాలి.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…