Political News

ఏం జ‌రిగినా ఇంతే.. జ‌గ‌న్ మౌనం వెనుక‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ మౌనంగా ఉంటున్నారు. భూకంపం వ‌చ్చినా స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎక్క డా నోరు విప్ప‌డం లేదు. ర‌చ్చచేయ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.

మ‌రింత మంది ఈ బాట‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డా మీడియా ముందుకు రాలేదు. వెళ్లిపోయిన వారికి అది చేశాను.. ఇది చేశాను..అ ని కామెంట్లు చేయ‌లేదు. ఎక్క‌డా తొంద‌ర ప‌డ‌డం కూడా లేదు.

సాధార‌ణంగా ఇలాంటి పరిస్థితి వేరే పార్టీల్లో ఉంటే.. వెంట‌నే సంబంధిత పార్టీ అధినేత లిఖిత పూర్వ‌కం గానో.. మీడియా ముఖంగానో బ‌య‌ట‌కు వ‌చ్చి ఆవేదన, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తారు. కానీ, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం ఇలాంటి ఆందోళ‌న క‌నిపించ‌డం లేదు.

దీనికి కార‌ణం ఏంటి. ఎందుకు ఆయ‌న అంత మౌనంగా ఉన్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఆది నుంచి జ‌గ‌న్‌లో ఇలాంటి వ్య‌వ‌హార శైలే ఉంది. అనేక మంది నాయ‌కులు వెళ్లిపోయినా.. ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, మేక‌పాటి చంద్ర‌శే ఖ‌ర‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వంటివారు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటేస్తార‌ని తెలిసి కూడా.. జ‌గ‌న్ భ‌య ప‌డ‌లేదు.

అత్యంత కీల‌క‌మైన ఆ స‌మ‌యంలోనూ.. మొండిగానే వ్య‌వ‌హ‌రించా రు. మీకు టికెట్లు ఇవ్వ‌న‌ని.. మీ ఇష్ట‌మైన‌ట్టే వ్య‌వ‌హ‌రించండ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఫ‌లితంగా పంచుమ‌ర్తి అనురాధ టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక‌, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు కూడా అనేక మంది నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వ‌డలేదు. దీంతో వారం తా కూడా.. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బాట ప‌ట్టారు. అప్పుడు కూడా జ‌గ‌న్ ఆలోచ‌న చేయ‌లే దు. సో… కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ స్పందించ‌న‌ప్పుడు.. ఇప్పుడు స్పందిస్తార‌ని అనుకోవ డం పొర‌పాటే. పైగా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఐదేళ్ల స‌మ‌యం ఉంది.

కాబ‌ట్టి.. ఏం జ‌రిగినా.. ఫ‌ర్వాలేద‌న్న విధంగానే జ‌గ‌న్ ఉండ‌డం గ‌మ‌నార్హం. త‌న పార్టీలో త‌న‌ను మెచ్చిన నాయకులే ఉంటార‌ని ఆయ‌న త‌ల‌పోస్తున్నారు త‌ప్ప‌.. పార్టీ విధానాల‌ను మార్చుకోవాల‌న్న ఆలోచ‌న మాత్రం చేయ‌డం లేదు.

This post was last modified on September 4, 2024 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

3 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

4 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

5 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

5 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

5 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

6 hours ago