వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉంటున్నారు. భూకంపం వచ్చినా స్థితప్రజ్ఞతనే ప్రదర్శిస్తున్నారు. ఎక్క డా నోరు విప్పడం లేదు. రచ్చచేయడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.
మరింత మంది ఈ బాటలో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జగన్ ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. వెళ్లిపోయిన వారికి అది చేశాను.. ఇది చేశాను..అ ని కామెంట్లు చేయలేదు. ఎక్కడా తొందర పడడం కూడా లేదు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితి వేరే పార్టీల్లో ఉంటే.. వెంటనే సంబంధిత పార్టీ అధినేత లిఖిత పూర్వకం గానో.. మీడియా ముఖంగానో బయటకు వచ్చి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ, జగన్ విషయంలో మాత్రం ఇలాంటి ఆందోళన కనిపించడం లేదు.
దీనికి కారణం ఏంటి. ఎందుకు ఆయన అంత మౌనంగా ఉన్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఆది నుంచి జగన్లో ఇలాంటి వ్యవహార శైలే ఉంది. అనేక మంది నాయకులు వెళ్లిపోయినా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశే ఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారు.. తనకు వ్యతిరేకంగా ఓటేస్తారని తెలిసి కూడా.. జగన్ భయ పడలేదు.
అత్యంత కీలకమైన ఆ సమయంలోనూ.. మొండిగానే వ్యవహరించా రు. మీకు టికెట్లు ఇవ్వనని.. మీ ఇష్టమైనట్టే వ్యవహరించండని ఆయన తేల్చి చెప్పారు. ఫలితంగా పంచుమర్తి అనురాధ టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు.
ఇక, సాధారణ ఎన్నికలకు ముందు కూడా అనేక మంది నాయకులకు టికెట్లు ఇవ్వడలేదు. దీంతో వారం తా కూడా.. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బాట పట్టారు. అప్పుడు కూడా జగన్ ఆలోచన చేయలే దు. సో… కీలకమైన ఎన్నికల సమయంలోనే జగన్ స్పందించనప్పుడు.. ఇప్పుడు స్పందిస్తారని అనుకోవ డం పొరపాటే. పైగా మళ్లీ ఎన్నికలకు ఐదేళ్ల సమయం ఉంది.
కాబట్టి.. ఏం జరిగినా.. ఫర్వాలేదన్న విధంగానే జగన్ ఉండడం గమనార్హం. తన పార్టీలో తనను మెచ్చిన నాయకులే ఉంటారని ఆయన తలపోస్తున్నారు తప్ప.. పార్టీ విధానాలను మార్చుకోవాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు.
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…